Director Shouryuv: ఆ రూమర్‌ ఎక్కడ నుంచి వచ్చిందో తెలియడం లేదు!

ABN , Publish Date - Aug 01 , 2024 | 04:48 PM

ఎన్టీఆర్‌తో తాను సినిమా తీయనున్నట్లు వస్తోన్న వార్తల్లో నిజం లేదని డైరెక్టర్‌ శౌర్యువ్‌ స్పష్టం చేశారు.

ఎన్టీఆర్‌తో Jr NTR) తాను సినిమా తీయనున్నట్లు వస్తోన్న వార్తల్లో నిజం లేదని 'హాయ్ నాన్న' ఫేమ్ డైరెక్టర్‌ శౌర్యువ్‌ (Shouryuv) స్పష్టం చేశారు. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో సినిమా రానుందని కొన్ని రోజులేగా వార్తలు వైరల్‌ అవుతున్న నేపథ్యంలో శౌర్యువ్‌ ఓ నేషనల్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించారు.

‘‘తారక్‌తో సినిమా చేయబోతున్న అని నాపై కొన్ని రోజులుగా వస్తోన్న వార్తల్లో నిజం లేదు. దురదృష్టవశాత్తు అది తప్పుడు సమాచారం. ఆ రూమర్‌ ఎక్కడ నుంచి వచ్చిందో కూడా తెలియడం లేదు. నేను కూడా ఇది నిజమవ్వాలని అనుకుంటున్నా. ఏదో ఒకరోజు ఎన్టీఆర్‌తో సినిమా తీయాలని కోరుకుంటున్నా’’ అని శౌర్యువ్‌ క్లారిటీ ఇచ్చారు.

జూనియర్‌ ఎన్టీఆర్‌తో కలిసి శౌర్యువ్‌ ఓ యాక్షన్‌ సినిమా తీయనున్నారని వారం రోజులుగా ప్రచారం జరుగుతోంది రెండు భాగాలుగా ఇది రానుందని.. మొదటి పార్ట్‌ 2026లో.. రెండోది 2028లో విడుదల చేేసలా ప్లాన్‌ చేసినట్లు వార్తలొచ్చాయి. ఎన్టీఆర్‌ కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. దీనిపై దర్శకుడు తాజాగా క్లారిటీ ఇవ్వడంతో ఆ వార్తలకు చెక్‌ పెట్టినట్లు అయింది. ప్రస్తుతం ఎన్టీఆర్‌ ‘దేవర’తో బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో సముద్రతీరం నేపథ్యంలో నడిచే యాక్షన్‌ డ్రామాగా ఇది రూపొందుతోంది. పాన ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాతో జాన్వీ తెలుగు తెరకు పరిచయమవుతుండగా, సైఫ్‌ అలీఖాన్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు.

Updated Date - Aug 01 , 2024 | 04:50 PM