Kalki 2898 AD: ప్ర‌పంచ‌మంతా ఈ స్టొరీకి రిలేట్ అవుతుంది: నాగ్ అశ్విన్

ABN , Publish Date - Jun 18 , 2024 | 08:47 PM

ప్ర‌స్తుతం దేశ‌మంతా ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న‌ మోస్ట్ ఎవైటెడ్ అప్ కమింగ్ సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘కల్కి 2898 AD’. తాజాగా మేకర్స్ ఎపిక్ జర్నీ ఎపిసోడ్ 1 - ది ప్రిల్యూడ్ ఆఫ్ కల్కి2898AD ని రిలీజ్ చేశారు.

Kalki 2898 AD: ప్ర‌పంచ‌మంతా ఈ స్టొరీకి రిలేట్ అవుతుంది: నాగ్ అశ్విన్
NAG ASHWIN

ప్ర‌స్తుతం దేశ‌మంతా ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న‌ మోస్ట్ ఎవైటెడ్ అప్ కమింగ్ సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘కల్కి 2898 AD’ (Kalki 2898 AD). ఇప్ప‌టికే విడుద‌లైన ప్రమోషనల్ కంటెంట్ తో గ్లోబల్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇటీవ‌లే రిలీజైన టీజర్, ట్రైలర్స్ కి గ్రౌండ్ బ్రేకింగ్ రెస్పాన్స్ వచ్చింది. నిన్న విడుదలైన 'భైరవ అంథమ్' ఇండియన్స్ బిగ్గెస్ట్ సాంగ్ అఫ్ ది ఇయర్ గా టాప్ చార్ట్ లో ఉంది. ఈ ఎక్సయిట్మెంట్ ని మరింతగా పెంచుతూ మేకర్స్ ఎపిక్ జర్నీ ఎపిసోడ్ 1 - ది ప్రిల్యూడ్ ఆఫ్ కల్కి2898AD ని రిలీజ్ చేశారు.

c1f1bd68-61ee-4ded-a351-a56ce99c57e9.jpeg

ఈ వీడియోలో డైరెక్టర్ నాగ్ అశ్విన్ (Nag Ashwin) మాట్లాడుతూ.. ఈ కథ బేసిక్ గా అన్నిటికి క్లైమాక్స్. కలియుగంలో ఏం జరుగుతుంది. ఏం జరగొచ్చు.. ఇలాంటి వాటన్నిటికీ ఇది క్లైమాక్స్‌. కేవలం ఇండియాలోనే కాదు వరల్డ్‌లో అందరూ ఈ కథకు రిలేట్ అవుతారు. చిన్నప్పటి నుంచి పౌరాణిక చిత్రాలంటే చాలా ఇష్టం. ‘పాతాళభైరవి’, ‘భైరవ ద్వీపం’, ‘ఆదిత్య 369’ నాకు ఇష్టమైన సినిమాలు. హాలీవుడ్‌ ‘స్టార్‌ వార్స్’ లాంటి సినిమా చూసినప్పుడు చాలా బావున్నాయనిపించాయి. అయితే ఇవి మన కథలు కావా? ఎప్పుడూ వెస్ట్ లోనే జరగాలా ? అనిపించేది.


మహాభారతంలో ఎన్నో గొప్ప పాత్రలున్నాయి. కృష్ణవతారంతో అది ఎండ్ అవుతుంది. అక్కడి నుంచి కలియుగంకు ఎంటరైనప్పుడు ఈ కథ ఎలా వెళుతుందనేది ప్యూర్ క్రియేటివ్ ఇమాజినేషన్. దిన్ని కథగా రాయలనుకున్నా. మనం చదివిన పురాణాలు, ఎపిక్స్ అన్నిటికి ఒక క్లైమాక్స్ లా ఉంటుంది. ప్రతి యుగంలో కలిపురుషుడిలా ప్రవర్తించేవారు ఉన్నారు. ఒక యుగంలో రావణుడు, మరోయుగంలో దుర్యోధనుడు.. ఇలా అన్నిట్లో ఒక రూపం తీసుకొని కలియుగంలో ఒక అల్టిమేట్ ఫైనల్ రూపం తీసుకుంటే అతనితో పోరాటం ఎలా ఉంటుందనే ఐడియాతో రాసుకున్నది.

ఈ కథ రాయడానికి 5 సంవత్సరాలు పట్టింది. ఈ సినిమాను చూసి ప్రేక్షకుల ఎలా రియాక్ట్ అవుతారని ఎదురుచూస్తున్నా’ అన్నారు. 'కల్కి 2898 AD' లో ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొణె, దిశా పటానీ సహా ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. వైజయంతీ మూవీస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ మల్టీలింగ్వెల్, మైథాలజీ -ఇన్స్ స్పైర్డ్ సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్ 2024 జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.

Updated Date - Jun 18 , 2024 | 09:36 PM