Chiranjeevi: ఫిలిం ఛాంబర్‌, ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ దృష్టి పెట్టాలి!

ABN , Publish Date - Jul 30 , 2024 | 08:08 PM

తెలుగు చిత్ర పరిశ్రమలోని నటీనటులు, సాంకేతిక నిపుణులను ప్రోత్సహిస్తూ ‘గద్దర్‌ అవార్డ్స్‌’ పేరిట పురస్కారాలు ప్రదానం చేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.

తెలుగు చిత్ర పరిశ్రమలోని నటీనటులు, సాంకేతిక నిపుణులను ప్రోత్సహిస్తూ ‘గద్దర్‌ అవార్డ్స్‌’ (Gaddar awards)పేరిట పురస్కారాలు ప్రదానం చేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డి (Revanth reddy)తీసుకున్న నిర్ణయంపై అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) కూడా హర్షం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ప్రతిపాదనను ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకెళ్లాలని అన్నారు. టాలీవుడ్  తరపున ఫిలిం ఛాంబర్‌, ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ ఈ విషయమై దృష్టి సారించాలని  ఆయన ట్వీట్ చేశారు. 

కొన్ని రోజుల కిందట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ.. ‘‘అవార్డులు ఇచ్చి ప్రోత్సహించడం వల్లే ఈరోజు మన సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ముందుకు వెళ్తున్నాయి. అవార్డులను పునరుద్ధరిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడమే కాదు, వాటికి ప్రజా గాయకుడు గద్దర్‌ పేరును పెట్టారు. సమాజంలో మార్పు కోసం జీవితమంతా ప్రయత్నించిన నిరంతర శ్రామిక కళాకారుడు. ఆయన పేరుతో అవార్డులు ఇవ్వడం ఎంతో సముచితం’’ అని అన్నారు.

అయితే ఈ ప్రతిపాదన తెలంగాణ ముఖ్యమంత్రి తీసుకొచ్చి చాలా రోజులు అయింది. అయినా తెలుగు చిత్రసీమ ఈ విషయంపై ద్రుష్టి పెట్టలేదని.. మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. 

Updated Date - Jul 30 , 2024 | 09:56 PM