TG CM Relief fund: వరద బాధితుల సహాయార్థం .. చెక్కులు అందజేశారు!

ABN , Publish Date - Sep 16 , 2024 | 01:35 PM

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వరద బాధితుల సహాయార్థం మెగాస్టార్ట్‌ చిరంజీవి ముఖ్యమంత్రి సహాయనిధికి ఆంధ్రాకు రూ.50 లక్షలు, తెలంగాణకు రూ. 50 లక్షలు ప్రకటించిన సంగతి తెలిసిందే.

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వరద బాధితుల (Flood Victims) సహాయార్ధం మెగాస్టార్ట్‌ చిరంజీవి (Chiranjeevi) ముఖ్యమంత్రి సహాయనిధికి ఆంధ్రాకు రూ.50 లక్షలు, తెలంగాణకు రూ. 50 లక్షలు ప్రకటించిన సంగతి తెలిసిందే. సోమవారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇంట్లో కలిసి సహాయనిధికి రూ. 50 లక్షల విరాళంను చెక్కు రూపంలో అందజేశారు. అలాగే రామ్‌ చరణ్‌ (Ram Charan) తరపున మరో 50 లక్షలు ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేశారు.

Sai.jpg

మెగా మేనల్లుడు సాయిధరమ్‌ (Sai dharam tej) తేజ్‌ కూడా తను ప్రకటించిన రూ.10లక్షల విరాళాన్ని రేవంత్‌కు అందజేశారు.

Vishwak.jpg

విశ్వక్‌సేన్‌ (Vishwak sen)రూ.10 లక్షలు, హాస్యనటుడు అలీ (Ali) రూ 3 లక్షలు విరాళాన్ని చెక్కు రూపంలో సీఎంకు అందజేశారు.

Ali.jpgఅమర్ రాజా గ్రూప్ తరపున సీఎం సహాయనిధికి  మంత్రి గల్లా అరుణకుమారి  రూ.కోటి విరాళం అందజేశారు.

Naga-vamsi.jpg

నిర్మాత సూర్యదేవర నాగవంశీ ప్రకటించిన  .రూ.25 లక్షల విరాళం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి విరాళం చెక్కును అందజేశారు.

వరద బాధితులను ఆదుకోవడంలో స్పందించి ప్రభుత్వానికి అండగా నిలిచినందుకు ఈ సందర్భంగా సీఎం గారు వారిని అభినందించారు.

Updated Date - Sep 16 , 2024 | 02:20 PM