Raj Tharun: అబార్షన్ చేయించాడు.. రాజ్‌తరుణ్‌-లావణ్య కేసులో కొత్త ట్విస్ట్‌

ABN , Publish Date - Jul 10 , 2024 | 02:16 PM

సినీ నటుడు రాజ్‌ తరుణ్‌ లావణ్య కేసు రోజురోజుకు మలుపులు తిరుగుతూ తాజాగా ఓ కొత్త ట‌ర్న్ తీసుకుంది. ఈ రోజు (బుధ‌వారం) పోలీసులు రాజ్ త‌రుణ్‌పై పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఇప్పుడు ఈ ఘ‌ట‌న టాలీవుడ్‌లో సంచ‌ల‌నంగా మారింది.

raj tharun

సినీ నటుడు రాజ్‌ తరుణ్‌ (Raj tharun) త‌న‌తో ప‌దేళ్లుగా రిలేష‌న్‌లో ఉండి మోసం చేశాడంటూ లావణ్య (Lavanya) అనే యువతి హైదరాబాద్‌లోని నార్సింగి పోలీసు స్టేషన్‌లో  ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. త‌ర్వాత లావణ్య, మాల్వీ ఒక‌రిపై ఒక‌రు ఫిర్యాదులు కూడా చేసుకుంటుండ‌డంతో ఈ కేసు రోజురోజుకు మలుపులు తిరుగుతూ తాజాగా ఓ కొత్త ట‌ర్న్ తీసుకుంది. ఈ రోజు (బుధ‌వారం) పోలీసులు రాజ్ త‌రుణ్‌పై పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఇప్పుడు ఈ ఘ‌ట‌న టాలీవుడ్‌లో సంచ‌ల‌నంగా మారింది.

వివ‌రాల్లోకి వెళితే.. బుధ‌వారం లావణ్య మ‌రోసారి రాజ్ తరుణ్, మాల్వీల‌పై ఫిర్యాదు చేసింది. అంతే కాకుండా పోలీసులకు కొన్ని ముఖ్య ఆధారాలు ఇచ్చినట్లు స‌మాచారం. వాటిలో రాజ్ త‌రుణ్‌తు ఉన్న 170 ఫొటోలు, ఇంకా ప‌లు టెక్నిక‌ల్ అండ్ మెడిక‌ల్ ఎవిడెన్స్‌లు అందజేసింది. దీంతో నార్సింగ్ పోలీసులు హీరో రాజ్ తరుణ్ పై ఐపీసీ 493 సహా మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.


అయితే.. రాజ్‌తరుణ్‌తో పదేళ్ల క్రితమే పెళ్లి అయ్యిందని, ప‌దేండ్లుగా కాపురం చేశామని.. కొన్నాళ్ల క్రితం ప్రెగ్నెన్సీ వ‌స్తే అబార్షన్ చేయించాడంటూ లావణ్య ఆరోపించింది. అందుకు సంబంధించి మెడికల్ డాక్యుమెంట్స్‌ను పోలీసులకు అందించానని తెలిపింది. అంతేకాకుండా చాలాకాలం అన్విక పేరుతో కలిసి ఉన్నామని.. అదే పేరుతో విదేశాలకు కూడా కలిసి వెళ్లిన‌ట్లు లావ‌ణ్య‌ పేర్కొంది.

కొంత‌కాలం క్రితం కానీ మాల్వీ మ‌ల్హోత్రా వచ్చాక రాజ్‌తరుణ్‌ తనను దూరం పెట్టాడని.. మాల్వీ కోసం రాజ్‌తరుణ్‌ ముంబైలో ఎక్కువ‌గా ఉంటున్నాడ‌ని, అత‌ను ఎప్పుడెప్పుడు ఉంబ‌య్‌కి వెళ్లింది, ఎవ‌రింటికి వెళ్లింది, ఎన్ని రోజులు ఉన్నాడు అనే చాలా విష‌యాలకు సంబంధించి అధారాలు ఉన్న‌ట్లు వివ‌రించింది.

Updated Date - Jul 10 , 2024 | 02:16 PM