Anasuya: నివాళిని కూడా ట్రోల్‌ చేస్తారా? ఇంత దారుణమా?

ABN , Publish Date - Jul 15 , 2024 | 04:06 PM

యాంకర్‌, నటి అనసూయ (Anasuya) సోషల్‌ మీడియా వేదికపై మరోసారి ఫైర్‌ అయ్యారు. ఆమెకు సంబంధించిన ఓ వీడియోపై కొందరు ట్రోల్‌ చేయడంపై ఆమె మండిపడ్డారు.


యాంకర్‌, నటి అనసూయ (Anasuya) సోషల్‌ మీడియా వేదికపై మరోసారి ఫైర్‌ అయ్యారు. ఆమెకు సంబంధించిన ఓ వీడియోపై కొందరు ట్రోల్‌ చేయడంపై ఆమె మండిపడ్డారు. నాలుగేళ్ల క్రితం ఓ షోలో మహానటి సావిత్రికి (Savithri Tribute song) నివాళిగా చేసిన వీడియోలో డాన్స్  మూమెంట్స్‌పై ట్రోల్‌ చేయడంపై ఆమె స్పందించారు. "పారదర్శక, గౌరవప్రదమైన విమర్శలను నేను ఎప్పుడూ ఆహ్వానిస్తాను. నా మానసిక ప్రశాంతతను దృష్టిలో ఉంచుకొని కొన్ని విషయాలపై స్పందించకూడదని నిర్ణయించుకున్నా. మహానటి సావిత్రమ్మకు నివాళిగా దాదాపు నాలుగేళ్ల క్రితం ఓ ఈవెంట్‌లో నేనిచ్చిన ప్రదర్శనలోని కొన్ని డ్యాన్స్‌ మూమెంట్స్‌ను ట్రోల్‌ చేయడం.. వాటికి ఇలా అవమానకర రీతిలో విమర్శలు చేయడం బాధాకరం.

Anasuya.jpg

ఇక్కడ నా గురించి చెప్పట్లేదు.. నివాళులకు సంబంధించిన విషయాల్లో ఇలా చేయడం ఆ గొప్ప వ్యక్తులను అవమానపర్చినట్లే..! మర్యాదపూర్వకమైన విమర్శలను నేను ఎప్పుడూ స్వాగతిస్తా. ఆ కార్యక్రమంలో నా మొత్తం ప్రదర్శన చూసిన తర్వాత మీరు ఒక నిర్ణయానికి రండి’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. అనసూయ ప్రస్తుతం వరుస సినిమాల్లో యాక్ట్‌ చేస్తున్నారు. ‘పుష్ప 2’తోపాటు ‘ఫ్లాష్‌బ్యాక్‌’, ‘వోల్ఫ్‌’ వంటి తమిళ చిత్రాల్లో నటిస్తున్నారు.

Updated Date - Jul 15 , 2024 | 04:09 PM