Tarakaratna: తారకరత్న భార్యకేమైంది.. సోషల్ మీడియాలో ఏంటి రచ్చ

ABN , Publish Date - Oct 09 , 2024 | 04:26 PM

తారకరత్న మరణం తర్వాత కాస్త రిలాక్స్ అవుతున్న కుటుంబంపై కొందరు సోషల్ మీడియాలో కొందరు విషం చిమ్ముతున్నారు. తారకరత్న భార్య అలేఖ్య.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ఈ క్రమంలోనే కొందరు చేస్తున్న కామెంట్స్ చిరాకు తెప్పిస్తున్నాయి. ఇంతకీ ఏమైందంటే..

Alekhya Tarakaratna

దివంగత నటుడు, రాజకీయవేత్త తారకరత్న(Tarakaratna) మరణం ఆ కుటుంబంలో విషాదఛాయలు మిగిల్చింది. ముగ్గురు పిల్లలే ప్రపంచంగా ఆయన భార్య అలేఖ్య (Alekhya) జీవిస్తోంది. మరణం తర్వాత కాస్త రిలాక్స్ అవుతున్న కుటుంబంపై కొందరు సోషల్ మీడియాలో కొందరు విషం చిమ్ముతున్నారు. తారకరత్న భార్య అలేఖ్య.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. తన పిల్లలకి సంబంధించిన పోస్టులు పెడుతుంటారు. సరదాగా క్యూ అండ్ ఏ (Q & A) సెషన్స్ నిర్వహిస్తారు. ఈ క్రమంలోనే కొందరు చేస్తున్న కామెంట్స్ చిరాకు తెప్పిస్తున్నాయి. ఇంతకీ ఏమైందంటే..


అలేఖ్య తారకరత్న ఎప్పటిలాగానే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ పిల్లలతో పాటు భర్త తారకరత్న గుర్తులను షేర్ చేస్తుంటారు. అయితే కొందరు భర్త చనిపోయిన కూడా ఈ వేశాలేంటని కామెంట్స్ పెడుతున్నారు. అలాగే ఇంతమంది పిల్లల్ని కనడం ఎందుకు అంటూ అసభ్యంగా కామెంట్స్ పెడుతున్నారు. వీటిపై ఆమె ఏమాత్రం అసహనం చెందకుండా కూల్‌గా డీల్ చేస్తుంది. ఎందుకు ఇంత ద్వేషం.. వీలైతే ప్రేమించండి.. ప్రేమని స్ప్రెడ్ చేయండి, అనవసరంగా ద్వేషం ఏర్పరుచుకొని సాధించేది ఏమిలేదని సున్నితంగా డీల్ చేశారు. మరోవైపు వైసీపీ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి(MP Vijayasai Reddy) ఆమెకు పెద్ద నాన్న కావడం, వైఎస్ షర్మిల (YS Sharmila) కూడా సన్నిహితురాలు కావడంతో వారిని ఆమె తరుచు కలుస్తుంటారు. ఈ నేపథ్యంలో రాజకీయ శ్రేణుల్లో కూడా అలేఖ్య తీరుపై అనవసరంగా విషం చిమ్ముతున్నారు.

Also Read- Trivikram Srinivas: సమంతపై త్రివిక్రమ్ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు

Also Read- Rajendra Prasad: రాజేంద్రప్రసాద్‌కు తలసాని పరామర్శ

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Oct 09 , 2024 | 04:26 PM