AAY: వరద బాధితులకు 'ఆయ్‌’ టీమ్‌ సాయం

ABN , Publish Date - Sep 02 , 2024 | 03:56 PM

వరద బాధితులను ఆదుకునేందుకు ‘ఆయ్‌’ చిత్రబృందం ముందుకు వచ్చింది. వరద బాధితులకు ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించుకుంది.


వరద బాధితులను ఆదుకునేందుకు ‘ఆయ్‌’ (AAY)చిత్రబృందం ముందుకు వచ్చింది. వరద బాధితులకు ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు నేటి నుంచి వీకెండ్‌ వరకూ ఆ చిత్రానికి రానున్న వసూళ్లలో నిర్మాత షేర్‌లో 25 శాతాన్ని జనసేన పార్టీ (Janasena PArty)తరఫున విరాళంగా అందజేయనున్నట్లు ప్రకటించింది. దీనిపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చిత్రబృందం మంచి మనసును అభిమానులు, నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. నార్నే నితిన్‌, నయన్‌ సారిక, రాజ్‌కుమార్‌ ప్రధాన తారాగణంగా తెరకెక్కిన చిత్రం ‘ఆయ్‌’. అంజి కె.మణిపుత్ర దర్శకత్వం వహించారు. బన్నీవాస్‌ నిర్మాత. ఫన్‌ ఎంటర్‌టైనర్‌గా సిద్థమైన ఈ సినిమా ఆగస్టు 15న విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా రూ.16.40 కోట్ల గ్రాస్‌ వసూలు చేసిందని సోమవారం చిత్రబృందం ప్రకటించింది. (Aay team helps to flood victims)

Updated Date - Sep 02 , 2024 | 03:57 PM