Chiranjeevi: పొర్లుదండాలతో తిరుమలకు.. చిరు సత్కారం!

ABN , Publish Date - Aug 26 , 2024 | 06:12 PM

చిరంజీవి (Chiranjeevi) మీదున్న అభిమానాన్ని చాటుకున్నాడు అభిమాని ఈశ్వరయ్య (Eswarayya). ఆగస్ట్‌ 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన బావుండాలని శ్రీవారిని మొక్కి మెట్ల దారిలో పొర్లు దండాలు పెట్టుకుంటూ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

చిరంజీవి (Chiranjeevi) మీదున్న అభిమానాన్ని చాటుకున్నాడు అభిమాని ఈశ్వరయ్య (Eswarayya). ఆగస్ట్‌ 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన బావుండాలని శ్రీవారిని మొక్కి మెట్ల దారిలో పొర్లు దండాలు పెట్టుకుంటూ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి తన అభిమాని కుటుంబాన్ని ఇంటికి పిలిచి  పట్టు బ‌ట్ట‌లు పెట్టి స‌త్క‌రించటం విశేషం. ఈ సంద‌ర్భంగా ఈశ్వ‌ర‌య్య కుటుంబానికి అండ‌గా ఉంటాన‌ని మెగాస్టార్ హామీనిచ్చారు. 
Chiru 2.jpeg

సోమవారం రోజున చిరంజీవి అయ్య‌ప్ప మాల‌ను ధరించారు. ప్ర‌తీ ఏడాది అయ్య‌ప్ప మాల‌ను ధరించే ఆయన ఈ ఏడాది కూడా మాల‌ను ధ‌రించారు. మాల‌ధార‌ణ‌లోనూ ఈశ్వ‌ర‌య్య కుటుంబంతో చిరంజీవి క‌లిసి మాట్లాడారు. సాధార‌ణంగా చిరంజీవి త‌న హార్డ్ కోర్ అభిమానుల‌కు ఎప్పుడూ అండ‌గా నిలుస్తుంటారు. చాలా సంద‌ర్భాల్లో ఇది నిరూప‌ణ అయ్యింది. ఇప్పుడు ఈశ్వ‌ర‌య్య గురించి తెలియ‌గానే మ‌రోసారి మెగాస్టార్ ఆయ‌న్ని ప్ర‌త్యేకంగా క‌లుసుకున్నారు. గతంలో ఈశ్వ‌ర‌య్య తిరుప‌తి నుంచి మెగాస్టార్ ఇంటి వ‌ర‌కు సైకిల్ యాత్ర‌ను నిర్వ‌హించారు. అదే విధంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ పుట్టిన‌రోజుకు, జనసేన పార్టీ నెగ్గాల‌ని ఇలా అనేక సార్లు పొర్లు దండాలు చేయ‌టం విశేషం. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ప్రస్తుతం చిరంజీవి వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర’ చిత్రంతో బిజీగా ఉన్నారు. యు.వి క్రియేషన్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో త్రిష కథానాయిక. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సంక్రాంతి కానునగా ఈ చిత్రం విడుదల కానుంది.   

Chiru3.jpeg

Updated Date - Aug 26 , 2024 | 06:13 PM