Toxic:  రంగంలోకి నయనతార.. భారీ షెడ్యూల్‌ ప్లాన్ 

ABN , Publish Date - Jun 16 , 2024 | 01:11 PM

'కేజీఎఫ్‌’ (KGF) సిరీస్‌ విజయాల తర్వాత యశ్‌ (Yash) కథానాయకుడిగా నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘టాక్సిక్‌’ (Toxic) గీతూ మోహన్‌దాస్‌ దర్శకత్వంలో  కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తోంది.

Toxic:  రంగంలోకి నయనతార.. భారీ షెడ్యూల్‌ ప్లాన్ 

'కేజీఎఫ్‌’ (KGF) సిరీస్‌ విజయాల తర్వాత యశ్‌ (Yash) కథానాయకుడిగా నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘టాక్సిక్‌’ (Toxic) గీతూ మోహన్‌దాస్‌ దర్శకత్వంలో  కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. నయనతార (Nayanatara), హ్యూమా ఖురేషి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ కోసం యశ్‌తో కలిసి నయన్‌ సెట్లోకి అడుగు పెట్టినట్లు తెలుస్తోంది.. ప్రస్తుతం వీళ్లిద్దరిపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు చిత్రవర్గం నుంచి సమాచారం రెండో షెడ్యూల్‌ను యూకేలో చిత్రీకరించనున్నారట. ఈ సినిమాలో కీలక భాగం అక్కడే చిత్రీకరణ చేసుకోనుందని.. దీనికోసం దాదాపు 150రోజులకు పైగా సుదీర్ఘ షెడ్యూల్‌ను ప్లాన్  చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. విజయవంతమైన ఆంగ్ల సిరీస్‌ ‘పీకీ బ్లైండర్స్‌’ ప్రేరణతో గీతూ ఈ కథను సిద్థం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో యశ్‌ పవర్‌ఫుల్‌ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నారు. ఇది వచ్చే ఏడాది ఏప్రిల్‌ 10న విడుదల కానుంది.  

Updated Date - Jun 16 , 2024 | 01:11 PM