12 యేండ్ల తర్వాత థియేట‌ర్ల‌లోకి.. వ‌ర‌ల‌క్ష్మి, విశాల్ రొమాన్స్ చిత్రం?

ABN , Publish Date - Jul 16 , 2024 | 03:21 PM

విశాల్ హీరోగా నటించిన ఒక చిత్రానికి 12 యేండ్ల‌ తర్వాత థియేట‌ర్ల‌లో విడుద‌ల‌కు మోక్షం లభించిన‌ట్లు తెలుస్తోంది. సుందర్ సి దర్శకత్వం వ‌హించిన ఈ సినిమాలో వ‌ర‌ల‌క్ష్మి, అంజ‌లి క‌థానాయిక‌లుగా న‌టించారు.

vishal

విశాల్ (Vishal) హీరోగా నటించిన ఒక చిత్రానికి 12 యేండ్ల‌ తర్వాత థియేట‌ర్ల‌లో విడుద‌ల‌కు మోక్షం లభించిన‌ట్లు తెలుస్తోంది. సుందర్ సి (Sundar) దర్శకత్వంలో విశాల్‌ నటించిన ‘మద గద రాజా’ (Mada Gaja Raja) చిత్రం ఇప్పుడు విడుదలకు సిద్ధమవుతున్నట్టు కోలీవుడ్‌లో వార్త‌లు బాగా హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

madagajaraja.jpg

ఈ చిత్రంలో విశాల్‌ సరసన అంజలి ( Anjali), వరలక్ష్మి (Varalaxmi Sarathkumar) హీరోయిన్లుగా నటించగా, సంతానం, సఠగోపన్‌ రమేష్‌ తదితరులు ఇతర పాత్రలను పోషించారు. బిచ్చ‌గాడు హీరో విజయ్‌ ఆంటోనీ (Vijay Antony) సంగీతం అందించారు. సంతానం, సుబ్బ‌రాజు, శ‌ర‌త్ మ‌రార్‌, సోనూ సూద్‌ ఇత‌ర పాత్ర‌ల్లో న‌టించారు. హ్యాపీడేస్ ఫేమ్ గాయ‌త్రి గుప్తా క‌మెడియ‌న్ సంతానంకు జోడీగా న‌టించింది.

mada.jpg

2012లో ప్రారంభించిన ఈ మ‌ద‌గ‌జ‌రాజా (Mada Gaja Raja) చిత్రం షూటింగ్ ఆ సంవ‌త్స‌ర‌మే పూర్తి చేశారు. హీరోయిన్ల‌ను ఇద్ద‌రు,ముగ్గురిని మార్చిన చివ‌ర‌కు వ‌ర‌ల‌క్ష్మి, అంజ‌లిలు ఫైన‌ల్ అయ్యారు. ఇంకా షూటింగ్‌లో భాగంగా హీరోయిన్ స‌దాపై ఓ ప్ర‌త్యేక గీతం కూడా చిత్రీక‌రించారు.

19.jpg

అనంత‌రం తెలుగు, త‌మిళంల‌లో ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు, అడియో ఈవెంట్లు సైతం నిర్వ‌హించి విడుద‌ల తేదీల‌ను కూడా ప్ర‌క‌టించారు.

16.jpg

కానీ అప్ప‌టికే ఈ నిర్మాత నిర్మించిన మ‌రో చిత్రం డిజాస్ట‌ర్ కావ‌డం, అర్థిక స‌మ‌స్యలు త‌లెత్త‌డంతో సినిమా విడుద‌ల నిర‌వ‌ధికంగా వాయిదా ప‌డుతూ వ‌చ్చి 12 యేండ్లుగా అటకెక్కి ఉంది.

2.jpg


9.jpg

ఇప్పుడు ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు దర్శక నిర్మాతలు సన్నాహాలు ప్రారంభించారు. ఇటీవల సుందర్‌ సి దర్శకత్వం వహించిన ‘అరణ్మనై-4’ చిత్రం ఘన విజయం సాధించడమే కాక‌ రూ.100 కోట్ల‌కు పైగా క‌లెక్ష‌న్లు రాబ‌ట్టింది.

vis.jpg

అంతేగాక హీరో విశాల్‌ మార్కెట్ పెరగడంతో సినిమా విడుద‌ల‌కు ఇది అనువైన స‌మ‌యమ‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు ఓ అంచ‌నాకు వ‌చ్చి రిలీజ్‌ చేసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నట్లు త‌మిళ మీడియా కోడై కూస్తోంది.

Varalakshmi Sarathkumar

సినిమా విడుదల తేదీని త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నట్లు స‌మాచారం. అయితే ఆగ‌స్టు 8న‌ విడుద‌ల చేయ‌నున్న‌ట్లు బాగానే ప్ర‌చారం జ‌రుగుతుంది కానీ ఇంకా అధికారికంగా ప్ర‌క‌ట‌న రాలేదు.

vl.jpg

ఇదిలా ఉండ‌గా ఈ సినిమా స‌మ‌యంలోనే విశాల్‌కు వ‌ర‌ల‌క్ష్మి (Varalaxmi Sarathkumar) మ‌ధ్య ఎన్నో రూమ‌ర్స్ వ‌చ్చాయి. వాళిద్ద‌రూ ప్రేమ‌లో ఉన్నార‌ని, త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకోబోతున్న‌ట్లు వార్త‌లు అప్పట్లో బాగా వైర‌ల్ అయ్యాయి. ప్ర‌స్తుతం వ‌ర‌ల‌క్ష్మి ఓ వ్యాప‌ర‌వేత్త‌ను పెళ్లి చేసుకోగా విశాల్ (Vishal) బ్యాచ్‌ల‌ర్‌గానే ఉన్నాడు.

11.jpg

గ‌త సంవ‌త్స‌రం ‘మా ర్క్‌ ఆంటోనీ’ చిత్రంతో ఘన విజయాన్ని సొంతం చేసుకున్న విశాల్‌ తన కెరీర్‌లో మొద‌టి సారి రూ.వంద కోట్ల క్లబ్‌లోకి చేరారు. ప్రస్తుతం ఆయన స్వీయ నిర్మాణ దర్శకత్వంలో ‘తుప్పరివాలన్‌-2’ (డిటెక్టివ్ 2) ను తెరకెక్కించే పనుల్లో నిమగ్నమై ఉన్నాడు.

18.jpg

Updated Date - Jul 16 , 2024 | 04:39 PM