Vidaa Muyarchi : ఓటీటీ, శాటిలైట్‌ హక్కులు ఎవరికంటే!

ABN , Publish Date - Jul 22 , 2024 | 05:02 PM

అజిత్‌కుమార్‌  హీరోగా మగిళ్‌ తిరుమేని దర్శకత్వంలో రూపొందుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘విడా ముయర్చి’. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్  నిర్మించిన ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆతురగా ఎదురుచూస్తున్నారు

అజిత్‌కుమార్‌ (Ajith kumar)  హీరోగా మగిళ్‌ తిరుమేని దర్శకత్వంలో రూపొందుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘విడా ముయర్చి’(Vidaa Muyarchi). లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్  నిర్మించిన ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆతురగా ఎదురుచూస్తున్నారు. తాజాగా విడుదలైన అజిత్  లుక్‌కు మంచి స్పందన రావడంతో అంచనాలు భారీగా పెరిగాయి. టాప్‌ స్టార్స్‌, టెక్నీషియన్లు ఈ చిత్రంలో భాగమయ్యారు. అజిత్‌ కెరీర్‌లో బ్లాక్‌ బస్టర్‌ మూవీ ‘మంగాత’ (గ్యాంబ్లర్‌)లో అజిత్‌ కుమార్‌, త్రిష, యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ త్రయం తమదైన నటనతో ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు మరోసారి వీరు ముగ్గురు ఆడియెన్స్‌ను మెప్పించనున్నారు.

ఇంకా ఈ చిత్రంలో ఆరవ్‌, రెజీనా, నిఖిల్‌ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. తాజాగా ఈ చిత్రం నుంచి అప్డేట్‌ వచ్చింది. సినిమా షూటింగ్‌ను పూర్తి చేసినట్టుగా నిర్మాణ సంస్థ ప్రకటించింది. చివరి షెడ్యూల్ ను  అజార్ బైజాన్ లో  పూర్తి చేసారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ  చిత్రయూనిట్‌ అందరూ కలిసి ఫోటోకు పోజిచ్చారు. షూటింగ్‌ను పూర్తి చేసిన ఆనందం వారి కళ్లల్లో కనిపిస్తోంది. ఎంతో సరదాగా షూటింగ్‌ను ఫినిష్‌ చేశారని అర్థం అవుతోంది. ఈ చిత్రం శాటిలైట్‌ హక్కులను సన్‌ టీవీ సొంతం చేసుకోగా, ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్‌ దక్కించుకుంది.  

Updated Date - Jul 22 , 2024 | 05:04 PM