Varalakshmi Sarathkumar: బిజీలోనూ టైమ్‌ కేటాయించారు.. గౌరవంగా ఉంది!

ABN , Publish Date - Jun 29 , 2024 | 02:03 PM

నటి వరలక్షీ శరతకుమార్‌ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. దాదాపు రెండు వారాలుగా సినీ రాజకీయ ప్రముఖులకు తన తల్లిదండ్రులతో కలిసి ఆహ్వాన పత్రికలు పంచుతోంది. -

Varalakshmi Sarathkumar: బిజీలోనూ టైమ్‌ కేటాయించారు.. గౌరవంగా ఉంది!

నటి వరలక్షీ శరతకుమార్‌ (Varalakshmi Sarath kumar) పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. దాదాపు రెండు వారాలుగా సినీ రాజకీయ ప్రముఖులకు తన తల్లిదండ్రులతో కలిసి ఆహ్వాన పత్రికలు పంచుతోంది. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీని (Narendrra modi) పెళ్లికి ఆహ్వానించారు.  ప్రముఖ గ్యాలరిస్ట్‌ నికోలయ్‌ సచ్‌దేవ్‌తో (Nicholai Sachdev) త్వరలోనే పెళ్లి పీట లెక్కబోతున్నారు. దాదాపు ఏడేళ్లు ప్రేమించుకున్న వీళ్లిద్దరూ ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్నారు. పెళ్లి సింపుల్‌గా చేసుకుంటున్నా రిసెప్షన్‌ మాత్రం చెన్నైలో గ్రాండ్‌గా చేసుకోనున్నట్లు కోలీవుడ్‌ మీడియా చెబుతోంది. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలను స్వయంగా ఆహ్వానించిన ఆమె  తాజాగా కుటుంబ సమేతంగా వెళ్లి ప్రధానిని ఆహ్వానించారు. 

Varu.jpg

దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియాలో పంచుకున్నారు.  ఈ ఫొటోలను వరలక్ష్మి ఎక్స్‌లో షేర్‌ చేస్తూ మోదీకి థ్యాంక్స్‌ చెప్పారు. ప్రధానిని కలవడం ఆనందంగా ఉందన్నారు. బిజీ షెడ్యూల్‌లో కూడా తమతో మంచి సమయం గడిపినట్లు తెలిపారు. చాలా గౌరవంగా ఉందన్నారు. సీనియర్‌ నటుడు శరత్‌కుమార్‌ కుమార్తెగా వెండితెరకు పరిచయమైనా ఆమె వైవిధ్యమైన నటనతో ఆకట్టుకుంది. కథానాయికగానే కాకుండా నెగటివ్‌ షేడ్‌ ఉన్న పాత్రలతోపాటు క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా రాణిస్తోంది. 

Updated Date - Jun 29 , 2024 | 02:08 PM