Bison: మారి సెల్వరాజ్, దృవ్.. ‘బైసన్‌’ తొలి షెడ్యూల్‌ పూర్తి

ABN , Publish Date - Jul 09 , 2024 | 09:04 PM

మారి సెల్వరాజ్ దర్శకత్వంలో చియాన్‌ విక్రమ్‌ తనయుడు ధృవ్, అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్న ‘బైసన్‌’ మూవీ తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది.

bison

మారి సెల్వరాజ్ (Mari Selvaraj) దర్శకత్వంలో చియాన్‌ విక్రమ్‌ తనయుడు ధృవ్ (DhruvVikram) నటిస్తున్న ‘బైసన్‌’ (Bison) మూవీ తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran ) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో పశుపతి (Pasupathy), కలైయరసన్ (Kalaiyarasan), రెజిషా విజయన్ (Rajisha Vijayan), హరికృష్ణన్‌, అళగమ్‌ పెరుమాళ్‌, అరువి మదన్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

GRKuWSxacAEkkvw.jpeg

నివాస్‌ కె.ప్రసన్న సంగీతం అందించే ఈ చిత్రానికి ఎళిల్‌ అరసు సినిమాటోగ్రఫీ సమకూర్చుతున్నారు. అప్లాజ్‌ ఎంటర్‌టైన్మెంట్‌ పతాకం, దర్శకుడు పా.రంజిత్‌కు చెందిన నీలం స్టూడియో సంయుక్తంగా ఈ మూవీ నిర్మిస్తున్నాయి. ఇటీవల ఫస్ట్‌లుక్‌ విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వచ్చిన విషయం తెల్సిందే.


GRjvsHqbEAAh6Jr.jpeg

ఈ నేపథ్యంలో తొలి షెడ్యూల్‌ విజయవంతంగా పూర్తి చేసుకుందని దర్శకుడు మారి సెల్వరాజ్‌ తన ఎక్స్‌ ఖాతాలో ట్వీట్‌ చేశారు. కాగా, మారి సెల్వరాజ్‌, వడివేలు, ఉదయనిధి కాంబినేషన్‌లో వచ్చిన ‘మామన్నన్‌’ ఘన విజయం సాధించిన విషయం తెల్సిందే. ఈ చిత్రం ద్వారా మారి సెల్వరాజ్ (Mari Selvaraj) చేపట్టిన ప్రాజెక్టు కావడంతో ‘బైసన్‌’ (Bison) పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Updated Date - Jul 09 , 2024 | 09:04 PM