Sudeep: రేణుకా స్వామి కుటుంబానికి న్యాయం జరగాలి!

ABN , Publish Date - Jun 17 , 2024 | 05:14 PM

నటి పవిత్ర గౌడ అసభ్య సందేశాలు పంపినందుకు ఒక యువకుడిని హత్య చేశారనే ఆరోపణలపై కన్నడ నటుడు దర్శన్‌ తూగుదీప అరెస్ట్‌ అయిన సంగతి తెలిసిందే!

Sudeep:  రేణుకా స్వామి కుటుంబానికి న్యాయం జరగాలి!

నటి పవిత్ర గౌడ (Pavithra gowda))అసభ్య సందేశాలు పంపినందుకు ఒక యువకుడిని హత్య చేశారనే ఆరోపణలపై కన్నడ నటుడు దర్శన్‌ తూగుదీప (Darshan)అరెస్ట్‌ అయిన సంగతి తెలిసిందే! రేణుకా స్వామి హత్య  కన్నడనాట సంచలనం సృష్టిస్తోంది. దీనిపై ప్రముఖ నటుడు కిచ్చా సుదీప్‌ (Sudeep)స్పందించారు. మృతుడి కుటుంబానికి న్యాయం జరగాలని డిమాండ్‌ చేశారు.

‘‘మీడియా ఏం చూపిస్తుందో అదే మాకు తెలుసు. ఎందుకంటే.. మేం పోలీసు స్టేషన్ కు వెళ్లి సమాచారం తెలుసుకోవడం లేదు. నిజాలను వెలికి తీసేందుకు మీడియా, పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నట్లు కనిపిస్తోంది. అందులో ఎలాంటి సందేహం లేదు. అలాగే బాధిత కుటుంబానికి న్యాయం దక్కాలి. మృతుడి భార్య, ఇంకా భూమ్మీదకు రాని ఆ బిడ్డకు న్యాయం జరగాలి. న్యాయం గెలవాలి’’ అని అన్నారు. ఈ కేసు కన్నడ చిత్ర పరిశ్రమను క్లిష్ట పరిస్థితిలోకి తీసుకెళ్తుందని అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇది త్వరగా ఒక కొలిక్కి వస్తుందనే ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ రంగం ఒకరిద్దరికి చెందినదని కాదని, ప్రస్తుతం ఇండస్ర్టీ ఎదుర్కొంటున్న నిందల నుంచి క్లీన్‌ చిట్‌ లబించాలని సుధీప్‌ అన్నారు.  పవిత్రా గౌడ, దర్శన్‌ పదేళ్లుగా సహజీవనంలో ఉన్నారని మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే దర్శన్‌కు ఇదివరకే విజయలక్ష్మితో పెళ్లి కావడంతో ఆ ముగ్గురి మధ్య గొడవలు జరుగుతున్నాయని అన్నారు.  తన అభిమాన హీరో వ్యక్తిగత జీవితంలో పవిత్ర చిచ్చుపెట్టారని దర్శన్‌ అభిమాని, చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి (28) ఆగ్రహంతో ఉండేవాడు. అందులో భాగంగా ఆమె ఇన్‌స్ట్టాగ్రామ్‌ ఖాతాకు అశ్లీల సందేశాలు పంపుతూ దూషిస్తూ వ్యాఖ్యలు చేశాడు.  

Updated Date - Jun 17 , 2024 | 05:20 PM