Rajinikanth: తిరుమల లడ్డూ వివాదం.. నో కామెంట్స్‌ అన్న తలైవా

ABN , Publish Date - Sep 28 , 2024 | 05:09 PM

తిరుమల లడ్డూ వివాదంపై స్పందించేందుకు తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ఆసక్తి చూపించలేదు. దీనిపై తాను కామెంట్స్‌ చేయాలనుకోవడం లేదన్నారు.


తిరుమల లడ్డూ (Tirumala laddu) ప్రసాదం కల్తీ జరిగిందన్న ఆరోపణలపై భక్తులు, ధార్మిక సంఘాలు మండిపడుతున్న సంగతి తెలిసిందే!  విచారణ జరిపించి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని సినీ రాజకీయ ప్రముఖులు, సామాన్యులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ వివాదంపై స్పందించేందుకు తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ (Rajinikanth) ఆసక్తి చూపించలేదు. దీనిపై తాను కామెంట్స్‌ చేయాలనుకోవడం లేదన్నారు. ప్రస్తుతం ‘వేట్టయాన్‌’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు రజనీకాంత్‌. ఆయన నటించిన తాజా చిత్రం గురించి అడిగి తెలుసుకున్నారు. ఓ రిపోర్టర్‌ మాత్రం ‘‘తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందంటూ వార్తలు వస్తున్నాయి. దానిపై మీ అభిప్రాయం ఏంటి? అని ప్రశ్నించగా.. ‘‘సారీ.. నో కామెంట్స్‌’’ అని అక్కడినుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. నెట్టింట వైరల్‌గా మారింది.

లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఇటీవల సత్యం సుందరం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో పాల్గొన్న కార్తి.. ‘ఇప్పుడు లడ్డూ గురించి మాట్లాడకూడదు. సున్నితమైన అంశం’ అని సరదాగా యాంకర్‌ ప్రశ్నకు బదులిచ్చారు. దీనిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ స్పందించారు. సనాతన ఽధర్మం జోలికి రావొద్దని హెచ్చరించారు. ‘‘ఈ అంశంపై మాట్లాడితే మద్దతుగా మాట్లాడండి. లేకపోతే మౌనంగా కూర్చోండి. మీ మాధ్యమాల ద్వారా అపహాస్యం   చేస్తే  ప్రజలు క్షమించరు. ఇది ఎంతో బాధ కలిగించే అంశం. లడ్డూపై జోకులేస్తున్నారు. మీరు ఒకటికి వందసార్లు ఆలోచించుకుని ప్రతి మాటా మాట్లాడండి’’ అని తెలిపారు.
రజనీకాంత్‌ హీరోగా నటించిన 'వేట్టయాన్‌ చిత్రం అక్టోబర్‌ 10న పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.  ఇందులో ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌గా రజనీకాంత్‌ కనిపించనున్నారు. అమితాబ్‌, ఫహద్‌ ఫాజిల్‌, రానా, మంజు వారియర్‌, రితికా సింగ్‌, దుషారా విజయన్‌ కీలక పాత్రలు పోషించారు.

Updated Date - Sep 28 , 2024 | 05:11 PM