వీళ్లు బాగుప‌డ‌రు! నా సినిమా పూర్తి చేసేందుకు.. హీరో హీరోయిన్ల చుట్టూ మూడేండ్లు తిరిగా!

ABN , Publish Date - Jul 30 , 2024 | 10:43 AM

అశోక్‌ సెల్వన్, అవంతిక మిశ్రా జంటగా తిరుమలై నిర్మించిన చిత్రం ‘ఎమక్కు తొళిల్‌ రొమాన్స్‌’ ఈ చిత్రం ఆడియో, ట్రైలర్ ఇటీవ‌ల‌ విడుదల చేశారు. ఈ సంద‌ర్భంగా నిర్మాత సినిమా హీరోహీరోయిన్ల‌పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Emakku Thozhil Romance

నిర్మాతలను విస్మరించే ఏ ఒక్క నటుడు కెరీర్‌లో పైకి ఎదగలేరని నిర్మాత తిరుమలై అన్నారు. అశోక్‌ సెల్వన్ (Ashok Selvan), అవంతిక మిశ్రా (Avantika Mishra) జంటగా టి క్రియేషన్స్‌ బ్యానరుపై నిర్మాత తిరుమలై (Thirumalai) నిర్మించిన చిత్రం ‘ఎమక్కు తొళిల్‌ రొమాన్స్‌’ (Emakku Thozhil Romance). బాలాజీ కేశవన్ (Balaji Kesavan) దర్శకుడు. ఈ చిత్రం ఆడియో, ట్రైలర్ ఇటీవ‌ల‌ విడుదల చేశారు. ఇందులో నిర్మాతల సంఘానికి చెందిన ముఖ్య నేతలతో పాటు ఫెప్సీ అధ్యక్షుడు ఆర్‌కె.సెల్వమణి తదితర సినీ ప్రముఖులు పాల్గొన్నారు.

GTeekefWIAAtLu0.jpeg

అయితే, హీరో అశోక్‌ సెల్వన్ (Avantika Mishra), హీరోయిన్‌ అవంతిక మిశ్రా (Avantika Mishra) మాత్రం హాజరుకాలేదు. ఈ సంద‌ర్భంగా నిర్మాత తిరుమలై (Thirumalai) మాట్లాడుతూ, ‘ఈ సినిమాను పూర్తి చేసేందుకు మూడేళ్ళపాటు ఒక నటుడిని, నటిని గాలించి గాలించి అలసిపోయాను. ఆ బాధ వర్ణనాతీతం. ఈ చిత్ర హీరో అశోక్‌ సెల్వన్‌ కూడా ఒక చిత్రాన్ని నిర్మించారు. ఆయనకు ఎంత డబ్బు ఇవ్వాలో అంత డబ్బు ఇచ్చి నా సినిమా షూటింగ్‌ కోసం డేట్స్‌ అడిగాను. ఆ స‌మ‌యంలో ఆయనకు రూ.31 లక్షలు ఇచ్చాను. ఇపుడు అతని పారితోషికం రూ.2 లేదా రూ.3 కోట్లు అవ్వొచ్చు. నేను ఇచ్చిన రూ.31 లక్షలకు వడ్డీ వేసినా కోటి రూపాయలు అవుతుంది అని అన్నారు.

GTeekefWIAAtLu0.jpeg


F59cBO3aUAAHCy5.jpeg

నిర్మాతలను పట్టించుకోని ఏ నటుడు కూడా ఉన్నత స్థితికి చేరుకున్న దాఖలా లేదు. ఈ స్టోరీ నచ్చడం వల్లే కదా ఆయన ఈ సినిమాలో నటించేందుకు సమ్మతించారు. రెండున్నర గంటల సమయం కేటాయించాలని రెండున్నర నెలలుగా ప్రాధేయ పడుతున్నా. ఇదిగో చెబుతాను.. అదిగో చెబుతాను అంటూ కాలయాపన చేశారు. ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమలకు హీరో వచ్చి ప్రమోట్‌ చేయాలి. ఒక సినిమా హిట్‌ అయితే అధికంగా సంపాదించుకునేది నటీనటులే కదా.

as.jpg

ఒక దర్శకుడికి కొండంత బలం ఆ చిత్రంలో నటించే నటీనటులే. అలాంటి దర్శక నిర్మాతల మనసులను గాయ పరిచే నటీనటులు ఎన్నటికీ బాగుండరు’ అని ఆయన తన మనసులోని ఆవేదనను వ్యక్తం చేశారు. కాగా, ఈ చిత్రంలోని ఇతర పాత్రలను సీనియర్‌ నటి ఊర్వశి, ఎంఎస్‌ భాస్కర్‌; విజయ్‌ వరదరాజ్‌ తదితరులు పోసించారు. నివాస్‌ కె.ప్రసన్న సంగీతం. ఈ సినిమాను ఆగస్టులో విడుదల చేయనున్నారు.

GIt1OIgbUAAln_t.jpeg

Updated Date - Jul 30 , 2024 | 11:17 AM