Pavithra Gowda: కస్టడీలోనూ మేకప్‌.. మారని తీరు!

ABN , Publish Date - Jun 27 , 2024 | 02:01 PM

కన్నడ నటుడు దర్శన్‌ (Darshan) తన అభిమాని రేణుకా స్వామిని (Renuka Swami) ఎంత కిరాతంగా చంపించాడో తెలిసిందే. ఈ కేసులో అతని ప్రియురాలు పవిత్ర గౌడ (Pavitra gowda)కూడా కస్టడీలో ఉంది.

Pavithra Gowda: కస్టడీలోనూ మేకప్‌.. మారని తీరు!

కన్నడ నటుడు దర్శన్‌ (Darshan) తన అభిమాని రేణుకా స్వామిని (Renuka Swami) ఎంత కిరాతంగా చంపించాడో తెలిసిందే. ఈ కేసులో అతని ప్రియురాలు పవిత్ర గౌడ (Pavitra gowda)కూడా కస్టడీలో ఉంది. అరెస్ట్‌ అయినా   ఆమె ప్రవర్తన  పోలీసులు నివ్వెరపోయేలా చేస్తోంది. కస్టడీలో ఉన్న ఆమె మేకప్‌ వేసుకుని, లిప్‌స్టిక్‌ రాసుకుని కన్పించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌ కావడమే కాకుండా దుమారం రేపాయి. దీంతో పోలీసులు చర్చలు చేపట్టారు. రేణుకాస్వామి హత్య కేసులో విచారణ నిమిత్తం జూన్‌ 15న పవిత్రా గౌడను పోలీసులు బెంగళూరులోని ఆమె నివాసానికి తీసుకెళ్లారు. ఆ సమయంలో ఆమె ముఖానికి మేకప్‌ వేసుకుని, లిప్‌స్టిక్‌ రాసుకుంది. లోపలికి మామూలుగా వెళ్లిన ఆమె.. ఆ తర్వాత పోలీసు సిబ్బందితో కలిసి ఇంటినుంచి బయటకువస్తుండగా మేకప్‌తో నవ్వుతూ కన్పించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. దారుణంగా జరిగిన ఈ హత్యపై ఆమె ముఖంలో ఎలాంటి పశ్చాత్తాపం కన్పించకపోవడంతో నెటిజన్లు, కన్నడ సినీ ప్రియులు ఆమెపై ఆగ్రహం చేస్తున్నారు. ఈ క్రమంలోనే చర్యలు చేపట్టిన డీసీపీ.. మహిళా ఎస్సైకి నోటీసుల జారీ చేశారు.

darshan.jpg


‘‘పవిత్రా గౌడతో పాటు వెళ్లిన మహిళా ఎస్సై నటి ప్రవర్తనను గమనించి అడ్డుకోవాల్సింది. నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గానూ ఆ పోలీసు అధికారిణికి నోటీసులు జారీ చేసి వివరణ అడిగాం’’ అని డీసీపీ తెలిపారు. మరోవైపు, జైల్లో పవిత్రను ఆమె తల్లి, కుమార్తె కలిశారు. ఆ సమయంలో నటి కన్నీళ్లు పెట్టుకున్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి.


ఇక దర్శన్ రేణుక స్వామిని హత్య చేయడానికి కారణం పవిత్ర గౌడనే అని స్పష్టం అవుతోంది. తన అభిమాన నటుడు దర్శన్‌  వ్యక్తిగత జీవితంలో పవిత్రా గౌడ చిచ్చుపెడుతోందంటూ ఆయన అభిమాని రేణుకాస్వామి సోషల్‌ మీడియాలో అస్ఘభ్యకర పోస్టు పెట్టాడు. ఆ విషయాన్ని ఆమె దర్శన్  కు చెప్పడంతో అతను హత్య ప్లాన్ చేశాడని పోలీసులు వెల్లడించారు. ఇప్పటికి ఈ కేసులో  మొత్తం 17 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో పవిత్రా గౌడను ఏ1, దర్శన్‌ను ఏ2గా పేర్కొన్నారు. వీరిపై త్వరలో ఛార్జ్‌ షీట్‌ దాఖలు చేయనున్నారు. హత్యకు ముందు అతడిని చిత్రహింసలకు గురిచేసినట్లు పోస్ట్‌మార్టం నివేదికలో వెల్లడైంది. ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్న సంగతి తెలిసిందే! హత్య అనంతరం మృతదేహాన్ని ఎవరికంటా పడకుండా మాయం చేసేందుకు దర్శన్‌ మరో నిందితుడికి రూ.30 లక్షలు ఇచ్చినట్లు దర్శన  విచారణలో అంగీకరించినట్లు పోలీసుల నుంచి సమాచారం.

Updated Date - Jun 27 , 2024 | 02:21 PM