Nayanatara: ఏజ్‌ గ్యాప్‌ లవ్‌.. వర్కవుట్‌ అయిందా?

ABN , Publish Date - Jul 24 , 2024 | 10:32 AM

నయనతార(Nayanatara), కవిన్ రాజ్‌ (Kavin raj) కీలక పాత్రధారులుగా ఓ చిత్రం తెరకెక్కనుంది. విష్ణు ఎడ్వన్‌ (Vishnu Edwan ) దర్శకుడిగా వ్యవహరిస్తున్న మొదటి చిత్రమిది.

నయనతార(Nayanatara), కవిన్ రాజ్‌ (Kavin raj) కీలక పాత్రధారులుగా ఓ చిత్రం తెరకెక్కనుంది. విష్ణు ఎడ్వన్‌ (Vishnu Edwan ) దర్శకుడిగా వ్యవహరిస్తున్న మొదటి చిత్రమిది. ఇటీవల ఈ చిత్రం మొదలైంది. తాజాగా ఈ సినిమా రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభమైంది. ఈ విషయాన్ని దర్శకుడు సోషల్‌ మీడియా వేదికగా తెలిపారు. నయన్, కవిన్‌ జంటగా ఉన్న ఓ రొమాంటిక్‌ ఫొటోను పంచుకున్నారు. కొత్త ప్రయాణం మొదలైందంటూ పోస్ట్‌ చేశారు. "ప్రేమకు వయసుతో సంబంధం లేదంటూ తనకన్న వయసులో పెద్దయిన ఒక మహిళతో ప్రేమ ప్రయాణం మొదలుపెడతాడు ఓ వ్యక్తి. మరి ఆ ప్రయాణంలో అతనెదుర్కొన్న పరిణామాలు ఏంటి? భిన్న వయసు గల ఆ ఇద్దరి వ్యక్తుల ప్రేమ గెలిచిందా? లేదా? అన్న ఇతివృత్తంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. సెవెన్‌ స్ర్కీన్‌ స్టూడియోస్‌ పతాకంపై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి జెన్‌ మార్టిన్‌ స్వరాలు సమకూర్చనున్నారు. 

Updated Date - Jul 24 , 2024 | 03:15 PM