Darshan: జైలులో హుందాగా దర్శన్.. వైరల్‌ అవుతున్న ఫొటోలు!

ABN , Publish Date - Aug 26 , 2024 | 10:43 AM

అభిమాని రేణుకాస్వామి (Renuka Swami) హత్య కేసులో విచారణ ఖైదీగా ఉన్న కన్నడ నటుడు దర్శన్‌కు (Darshan)జైల్లో రాచమర్యాదలు జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

అభిమాని రేణుకాస్వామి (Renuka Swami) హత్య కేసులో విచారణ ఖైదీగా ఉన్న కన్నడ నటుడు దర్శన్‌కు (Darshan)జైల్లో రాచమర్యాదలు జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ కేసు విచారణ ఇంకా కొనసాగుతోంది.  జైలు కెళ్లిన తర్వాత దర్శన్‌  కుంగిపోయాడంటూ..అనారోగ్యానికి గురయ్యాడని వార్తలు కూడా వచ్చాయి. అయితే అవన్నీ అవాస్తవాలేనని దర్శన్‌ కు జైలులోనూ అన్ని సౌకర్యాలు అందుతున్నాయని తెలుస్తోంది. ఇది నిజమే అన్నట్లుగా ఆదివారం సోషల్‌ మీడియాలో ఓ ఫొటో వైరల్‌ అయింది. దీనితో అనేక అనుమానాలు రేకెత్తున్నాయి. అంతే కాదు దీనికి సంబంధించి ఓ వీడియో కూడా బయటకు రావడంతో ఆ ఆరోపణకు మరింత బలం చేకూరింది.   (Darshan luxury life in Jail)

వీడియో కాల్‌లో (Darshan video call in jail) ఓ వ్యక్తి అవతలి వైపు మరో వ్యక్తితో మాట్లాడాడు. మధ్యలో దర్శన్‌ చేతికి ఫోన్‌ ఇచ్చి పక్కకు జరిగినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఇద్దరూ ఒకరికొకరు హాయ్‌ చెప్పుకొంటూ పలకరించుకున్నారు. అనంతరం తిన్నావా అని అవతలి వ్యక్తి అడగ్గా.. దర్శన్‌ నవ్వుతూ అయిపోయిందంటూ సమాధానం ఇచ్చినట్లు వీడియోలో కనిపిస్తోంది. కాసేపు మాటల తర్వాత ఇద్దరూ బై చెప్పుకొన్నారు. 25 సెకన్ల పాటు ఉన్న ఈ వీడియోలో దర్శన్‌ మంచి వెలుతురు ఉన్న గదిలో కూర్చొని మాట్లాడుతున్నట్లుగా ఉంది. ఆయన వెనకాల కిటికీ పరదాలు ఉన్నాయి. హ్యంగర్‌కు దుస్తులు వేలాడుతున్నాయి. ప్రస్తుతం దర్శన్‌ బెంగళూరులోని పరప్పన అగ్రహార కేంద్ర కారాగారంలో విచారణ ఖైదీగా ఉన్నారు. జైలు బ్యారక్‌ నుంచి బయటకు వచ్చి స్నేహితులతో కూర్చొని కాఫీ, సిగరెట్‌ తాగుతున్న ఫొటో ఒకటి నెట్టింట వైరల్‌ అవుతోంది. రౌడీషీటర్‌ వేలు ఆ చిత్రాన్ని రహస్యంగా సెల్‌ఫోన్‌లో బంధించి బయట ఉన్న తన భార్య సెల్‌ఫోన్‌కు పంపించినట్లు తెలిసింది. ఈ చిత్రం వైరల్‌గా మారడం నగర పోలీసులకు పెద్దతల నొప్పిగా మారింది. దీంతో జైల్లో నిందితుడు దర్శన్‌కు రాచమర్యాదలు లభిస్తున్నాయంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆ ఫొటోలో దర్శన్‌తో కలిసి కాఫీ తాగుతున్న వారిలో రౌడీషీటర్‌ విల్సన్‌గార్డన్‌ నాగ కూడా ఉన్నారు.
దీనిని చూసిన నెటిజన్లు జైలులో దర్శన్‌కు ఇంకా ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారో అని జైలు అధికారుల తీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దర్శన్‌ ది హై ప్రొఫైల్‌ కేసు కావడంతో అందరి దృష్టి దీనిపైనే ఉంది. దర్శన్‌కు వ్యతిరేకంగా ఇప్పటికే చాలా సాక్ష్యాలు లభించాయి. మరికొద్ది రోజుల్లోనే పోలీసులు చార్జిషీటును సమర్పించనున్నారు. ఈ క్రమంలో దర్శన్‌ ఫోటో బయటకు వచ్చింది. ఈ ఫొటోపై డీజీ మాలిని కృష్ణమూర్తి విచారణకు ఆదేశించారు.

ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌ కావడంతో పోలీసుల తీరును, జైలులో దర్శన రాచమర్యాదల గురించి నెటిజన్లు ట్రోలింగ్‌ మొదలుపెట్టారు. పేరున్నవాడు, ధనికుడు ఓ సామాన్యుడిని చంపితే.. జైలులో రాచమర్యాదలు చేస్తారు.. ఓ సామాన్యుడు ట్రాఫిక్‌ రూల్స్‌ ఉల్లంఘిస్తే కట్టేసి కొడతారు’’ అంటూ మీమ్స్‌ క్రియేట్‌ చేసి ట్రోల్‌ చేస్తున్నారు. ఇదీ భారతీయ లా అండ్‌ ఆర్డర్‌’ అని కామెంట్లు చేస్తున్నారు.







Updated Date - Aug 26 , 2024 | 10:43 AM