Mani Ratna - Sai Pallavi: అందరూ ఒకలా ఆలోచిస్తే.. మణిరత్నం మరోలా.. కోరిక బయటపెట్టారు 

ABN , Publish Date - Oct 21 , 2024 | 06:41 PM

లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి పై ప్రశంసల వర్షం కురిపించారు అగ్ర  దర్శకుడు మణిరత్నం. 'అమరన్' ఆడియో వేడుకకు అతిధిగా హాజరైన ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  మనసులోని కోరికను బయటపెట్టారు. 

భారతీయ చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ దర్శకుల్లో మణిరత్నం (Mani Ratnam) ఒకరు. ఆయన దర్శకత్వంలో పని చేయాలని స్టార్‌ హీరోలు, హీరోయిన్లు కలలు కంటుంటారు. కానీ ఆయన మాత్రం ఓ హీరోయిన్‌తో పని చేయాలనుందనే కోరికను వెల్లడించారు. అసలు విషయంలోకి వెళ్తే.. శివ కార్తికేయన్‌, సాయి పల్లవి (Sai pallavi) కాంబోలో అమరన్‌ చిత్రం తెరకెక్కుతోంది.  రాజ్‌కుమార్‌ (Raj kumar periya swami) పెరియస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుక చెన్నైల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మణిరత్నం సాయి పల్లవితో సినిమా చేయాలనుందని వేదికపై చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. వేదికపై మణిరత్నం మాట్లాడుతూ "నేను సాయిపల్లవి నటనకు అభిమానిని. మీతో పని చేయాలని ఎప్పటి నుంచో ఉంది. ఏదో ఒక రోజు తప్పకుండా సినిమా చేస్తానని ఆశిస్తున్నాను’’ అని అన్నారు.


Sai-pallavi.jpg

మణిరత్నం నోట ఆ మాటలు విన్న లేడీ పవర్‌స్టార్‌ సాయి పల్లవి ఆనందం వ్యక్తం చేసింది. అనంతరం ఆమె మాట్లాడుతూ " సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు మణిరత్నంగారి పేరు తప్ప మరో దర్శకుడి పేరు తెలీదు. నేను కథ ఎంపికలో పర్ఫెక్‌గా ఉండటానికి ఆయన సినిమాలు ఒక కారణం’’ అని అన్నారు. అయితే కెరీర్‌ బిగినింగ్‌ మణిరత్నం సినిమాలో సాయిపల్లవికి ఆఫర్‌గా రాక ఆమె తిరిస్కరించిందనే వార్తలు వచ్చాయి.

తాజాగా ఆమె నటిస్నుత్న 'అమరన్‌’ ఈ నెల 31న పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఉగ్ర దాడిలో అమరుడైన మేజర్‌ ముకుంద్‌ వరదరాజన్‌ బయోపిక్‌ కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. శివ కార్తికేయన్‌  ముకుంద్‌ వరదరాజన్‌ పాత్ర పోషిస్తుండగా, ఆయన భార్య రెబెకాగా  సాయి పల్లవి కనిపించనుంది.    

     

Updated Date - Oct 21 , 2024 | 06:58 PM