Malavika Mohanan: అలాంటి ఓ సన్నివేశం ఉందని నాకు చెప్పలేదు!

ABN , Publish Date - Jul 25 , 2024 | 03:44 PM

చియాన్ విక్రమ్‌ ప్రధాన పాత్రలో వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘తంగలాన్‌’. పా.రంజిత్‌ దర్శకత్వంలో రానున్న ఈ చిత్రంలోని మాళవిక మోహనన్  కథానాయికగా నటిస్తోంది.


చియాన్ విక్రమ్‌ ప్రధాన పాత్రలో వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘తంగలాన్‌’. పా.రంజిత్‌ దర్శకత్వంలో రానున్న ఈ చిత్రంలోని మాళవిక మోహనన్  కథానాయికగా నటిస్తోంది. సినిమాలో ఓ సన్నివేశం గురించి ఆమె ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.  ‘ఈ చిత్రం కోసం నేను 5 గంటలు మేకప్‌ వేసుకోవాల్సి వచ్చింది. స్కిన్‌ స్పెషలిస్ట్‌ దగ్గర నుంచి కంటి డాక్టర్‌ వరకు ఐదుగురు వైద్యులను కలిశాను. ఒక్కోరోజు దాదాపు 10 గంటలపాటు కెమికల్స్‌తో చేసిన మేకప్‌ శరీరంపై ఉండేసరికి ఎలర్జీ వచ్చింది’ అని చెప్పారు.

మరో విషయం గురించి చెబుతూ '‘ఒకరోజు సెట్‌కు వెళ్లే సరికి పెద్ద గేదెను తీసుకొచ్చారు. దర్శకుడు దాన్ని నాకు చూపించి ఎక్కగలవా అని అడిగారు. సరదాగా అన్నారనుకున్నా. మేకప్‌ వేసుకోవడం పూర్తయిన తర్వాత దానిపై కూర్చోమన్నారు. నేనెప్పుడూ గేదెపైకి ఎక్కలేదని మరోసారి చెప్పే ప్రయత్నం చేసినా ఆయన వినలేదు. సన్నివేశం చిత్రీకరించాలి.. గేదెపై కూర్చోవాలని అడిగారు. భయంతోనే దానిపై ఎక్కాను. అసలు అలాంటి సన్నివేశం ఉంటుందని దర్శకుడు ముందు నాకు చెప్పలేదు. అందుకే ఒక్కసారిగా ఆశ్చర్యపోయాను’ అని అన్నారు. కర్ణాటకలోని కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌ కార్మికుల జీవితాల ఆధారంగా దర్శకుడు పా.రంజిత్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. మాళవిక మోహనన్‌, పార్వతి తిరువొత్తు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. 

Malvika.jpg

Updated Date - Jul 25 , 2024 | 03:47 PM