Rajinikanth: నేను ఏదైనా చేయనా? చెక్‌ బౌన్స్‌ కేసుపై లింగుస్వామికి రజనీ ఫోన్‌

ABN , Publish Date - Sep 13 , 2024 | 09:22 AM

రామ్‌ వారియ‌ర్ మూవీ డైరెక్ట‌ర్ లింగుస్వామికి చెక్‌ బౌన్స్‌ కేసులో కోర్టు ఆరు నెలల జైలుశిక్ష విధించిన సంగ‌తి తెలిసిందే. ఈ విషయమై తాజాగా లింగుస్వామి మాట్లాడుతూ ఆ స‌మ‌యంలో ర‌జ‌నీకాంత్ అన్న మాట‌ల‌ను గుర్తు చేసుకున్నారు.

Lingusamy

ర‌న్‌, పందెంకోడి వంటి సినిమాల‌తో అల‌రించి తెలుగులో గ‌త సంవ‌త్స‌రం రామ్‌ వారియ‌ర్ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన డైరెక్ట‌ర్ లింగుస్వామి(Lingusamy)కి చెక్‌ బౌన్స్‌ కేసులో కోర్టు ఆరు నెలల జైలుశిక్ష విధించింది. ఈ విషయం తెలుసుకున్న సూపర్‌ స్టార్‌ రజనీకాంత్ (Rajinikanth) స్వయంగా లింగుస్వామికి ఫోన్‌ చేసి.. ‘నేను ఏదైనా చేసేదా? అంటూ అడిగారు. ఈ విషయాన్ని లింగుస్వామి (Lingusamy) తాజాగా వెల్లడించారు. విష‌యానికి వ‌స్తే.. గతంలో లింగుస్వామి దర్శకత్వంలో వచ్చిన ‘ఉత్తమ విలన్‌’ డిజాస్టర్‌ ఫ్లాప్‌ సొంతం చేసుకుంది.

దీంతో ఆయన ఆర్థికంగా నష్టపోయారు. ఆ తర్వాత ‘ఇడమ్‌ పొరుల్‌ ఏవల్‌’ అనే సినిమాను లింగుస్వామి తెరకెక్కించారు. అయితే, పీవీపీకి, తిరుపతి బ్రదర్స్‌కు మధ్య ఆర్థిక వివాదం కేసు జరుగుతుంది. పీవీపీ సంస్థ నుంచి తీసుకున్న రుణం తిరిగి చెల్లించే నిమిత్తం ఆ సంస్థకు లింగుస్వామి ఇచ్చిన చెక్కు బౌన్స్‌ అయింది. ఈ వ్యవహరంలో సైదాపేట కోర్టు లింగుస్వామికి ఆరు నెలల జైలుశిక్ష విధించింది. దీన్ని హైకోర్టులో సవాల్‌ చేయగా అక్కడ కూడా చుక్కెదురైంది.


unnamed.jpg

ఈ విషయం తెలుసుకున్న రజనీకాంత్ (Rajinikanth) స్వయంగా లింగుస్వామి(Lingusamy) కి ఫోన్‌ చేసి... ‘నేను ఏమైనా చేయనా? సమస్య ఏంటి? ఎంత మొత్తం ఉంటుంది’ అంటూ ఆరా తీశారు. ఆ సమయంలో నేను ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు. విచారించడంలో తప్పులేదు. కానీ, ఆ మొత్తం ఎంతో చెప్తే సెటిల్‌ చేసేద్దాం అని తలైవర్‌ చెప్పడం జీవితంలో మరచిపోలేని విషయం అని లింగుస్వామి తాజాగా వెల్లడించారు.

Updated Date - Sep 13 , 2024 | 09:22 AM