BigBoss 8: మణికంఠకి మరో వార్నింగ్ తప్పదా..

ABN , Publish Date - Oct 12 , 2024 | 07:28 AM

బిగ్‌బాస్ హౌస్‌లో మణికంఠ బిహేవియర్ ఒకప్పుడు యష్మీకి ఇబ్బంది కలిగిస్తే.. ఈ సారి మాత్రం చూసే ఆడియెన్స్ ని కూడా ఇబ్బంది పెట్టింది. దీంతో ఆడియెన్స్ ఫైర్ అవుతున్నారు. నాగార్జున నుండి మరో వార్నింగ్ తప్పదు అంటున్నారు. ఇంతకీ ఏమైందంటే..

బిగ్‌బాస్ హౌస్‌లో వరుస వివాదాలు హీట్ పెంచేస్తున్నాయి. కొన్ని వారాల క్రితం ఓ తప్పు చేసి నాగార్జునతో క్లాస్ పీకించుకున్న మణికంఠకి మరో వార్నింగ్ తప్పేలా లేదు. గతంలో ఒక యష్మీ తో చేసిన తప్పును ఈ సారి మరో ఇద్దరితో చేశాడు. హౌస్‌లో మణికంఠ బిహేవియర్ ఒకప్పుడు యష్మీకి ఇబ్బంది కలిగిస్తే.. ఈ సారి మాత్రం చూసే ఆడియెన్స్ ని కూడా ఇబ్బంది పెట్టింది. దీంతో ఆడియెన్స్ ఫైర్ అవుతున్నారు. నాగార్జున నుండి మరో వార్నింగ్ తప్పదు అంటున్నారు. ఇంతకీ ఏమైందంటే..


కొన్ని వారాల క్రితం మణికంఠ వెనుకాల నుండి యష్మీని కౌగిలించుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనతో యష్మీ కూడా చాలా ఇబ్బంది పడింది. ఆ విషయాన్ని ఇతర కంటెస్టెంట్స్ తో షేర్ చేసుకొని బాధపడింది. దీంతో సీరియస్ అయిన బిగ్‌బాస్.. నాగార్జునతో మణికంఠని కన్ఫెషన్ రూమ్‌కి పిలిపించి వార్నింగ్ ఇప్పించాడు. అయిన మనోడి బుద్ధి మారలేదు. మరోసారి నయని, రోహిణిలతో సేమ్ బిహేవియర్ కొనసాగిస్తూ.. ప్రేక్షకుల ఆగ్రహానికి గురవుతున్నాడు.


అసలు ఏం జరిగిందంటే..

బిగ్‌బాస్ లేటెస్ట్ ఎపిసోడ్‌లో మెగా చీఫ్ కోసం టాస్క్ నిర్వహించారు. దీని కోసం రాయల్ క్లాన్ నుండి అవినాష్, రోహిణి, నయని, హరితేజ, మెహబూబ్ కంటెస్ట్ చేయగా.. ఓజీ క్లాన్ నుండి మణికంఠ పోటీపడ్డాడు. దీంతో ఓజీ క్లాన్ చాకచక్యంగా ఒక్కొక్కరిని టాస్క్ నుండి ఎలిమినినేట్ అయ్యేలా ప్లాన్ చేశారు.

మొదటగా ఓజీ క్లాన్.. నయనిని టార్గెట్ చేసింది. అనుకున్నట్లే ప్లాన్ ప్రకారం ఆమెని ఎలిమినేట్ చేశారు. అంతమందిలో మొదటగా ఆమెనే టార్గెట్ చేయడంతో ఏడుస్తూ.. ఫేస్ వాష్ చేసుకోవడానికి వెళ్ళింది. ఈ క్రమంలో మణికంఠ ఆమెని వెనక్కి నుంచి వెళ్లి టైట్ హగ్ ఇచ్చాడు. "ఫీల్ అవ్వకురా.. నువ్వు స్పోర్టివ్‌గా తీసుకోలేదని అర్థమైంది.. కావాలంటే ఈ రౌండ్‌లో నన్ను ఔట్ చెయ్" అంటూ మణికంఠ అన్నాడు. దీనికి నయని అలా ఏం లేదుటూ సమాధానమిచ్చింది. దీంతో మణికంఠ మరోసారి ఆమెని టైట్ గా హగ్ చేసుకున్నాడు.

అనంతరం ఓజీ క్లాన్ సేమ్ ప్లాన్ తో రోహిణిని టార్గెట్ చేసి అవుట్ చేశారు. దీంతో ఎమోషనల్ అయిన రోహిణి ఏడుస్తూ.. ఫేస్ వాష్ చేసుకోవడానికి వెళ్లింది. ఈ సారి కూడా మణికంఠ రోహిణి దగ్గరికి వెళ్లి వెనుకాల నుండి గట్టిగ పట్టుకొని హగ్ ఇస్తూ.. ఏడుస్తున్నావారా అంటూ అడిగాడు. దీనికి రోహిణి నాకు ఏడ్వాలని లేదు.. అంటూ రిప్లై ఇచ్చింది. దీనికి ఏడవాలంటే ఏడ్చేయడమే.. నేను ఏడ్చానుగా.. విగ్గు పీకి మరీ ఏడ్చేశా.. సరే స్పేస్ తీసుకో కాసేపు అంటూ మణికంఠ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇలా మణికంఠ కన్సెంట్ లేకుండా హగ్స్ ఇవ్వడంతో హౌస్ మెంబర్స్ తో పాటు చూసే ఆడియెన్స్ కూడా ఇబ్బందిగా ఉందంటున్నారు. ఏది ఏమైనా మరోసారి నాగార్జునతో మణికంఠకి మరో సీరియస్ వార్నింగ్ అవసరం అంటున్నారు.

Updated Date - Oct 12 , 2024 | 07:28 AM