Etv Telugu: మ‌హిళ‌ల‌కు పండ‌గే.. ఒకే రోజు ఈటీవీలో రెండు కొత్త సీరియ‌ల్స్ ప్రారంభం

ABN , Publish Date - Jul 02 , 2024 | 12:35 PM

ఈటీవీ కొత్త‌గా రెండు తెలుగు సీరియ‌ల్స్‌ను త‌మ ఛాన‌ల్‌లో ప్ర‌సారం చేయ‌డానికి న‌డుం బిగించింది. ఇవి మ‌ధ్యాహ్నం ప్ర‌సారం కానున్నాయి.

Etv Telugu: మ‌హిళ‌ల‌కు పండ‌గే.. ఒకే రోజు ఈటీవీలో రెండు కొత్త సీరియ‌ల్స్ ప్రారంభం
e tv telugu

ప్రేక్ష‌కుల‌కు ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందించ‌డంలో అయా ఛాన‌ళ్లు ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. ఇత‌ర ఛాన‌ళ్ల‌తో పోటీ ప‌డి మ‌రి సీరియ‌ల్స్‌ను తీసుకువ‌స్తున్నాయి. గ‌త రెండు నెల‌లో జెమినీ, స్టార్ మా మూడు నాలుగు సీరియ‌ల్స్‌ను ప్రారంభించ‌గా ఇప్పుడు ఆ లిస్టులో ఈ టీవీ (EtvTelugu) చేరి ఒకే రోజు రెండు కొత్త సీరియ‌ల్స్‌ను టెలికాస్ట్ చేయ‌బోతున్నాయి. వ‌సంత కోకిల‌, కాంతార అనే రెండు ధారావాహిక‌ల‌ను జూలై 2 నుంచి బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు సిద్ధ‌మ‌య్యాయి. సోమ‌వారం నుంచి శ‌నివారం వ‌ర‌కు వ‌సంత కోకిల (Vasantha Kokila)సీరియ‌ల్ మ‌ధ్యాహ్నం 1.30 నుంచి 2 గంట‌ల వ‌ర‌కు ఈటీవీలో టెలికాస్ట్ కాబోతోంది. కాంతార (Kantara) సీరియ‌ల్ మ‌ధ్యాహ్నం రెండు గంట‌ల నుంచి ప్ర‌సారం కానున్నాయి.

GRZL7s2XoAA310X.jpeg

వ‌సంత కోకిల (Vasantha Kokila) క‌థ ఏంటంటే.. అందం, తెలివితేట‌లు పుష్క‌లంగా ఉన్న అమ్మాయి సంధ్య సూర్యాన్ని పెళ్లి చేసుకుని ఎన్నో క‌ల‌ల‌తో కొత్త జీవితాన్ని మొద‌లుపెడుతుంది. విధి కార‌ణంగా పెళ్లి జ‌రిగిన కొద్ది రోజుల‌కే సూర్యం క‌న్నుమూస్తాడు. దీంతో భ‌ర్త‌కు ఇచ్చిన మాటకు క‌ట్టుబ‌డి సూర్య త‌ల్లిదండ్రులు మాధ‌వ‌రావు, ల‌క్ష్మీల‌ను త‌న సొంత అమ్మ‌నాన్న‌లుగా ప్రేమ‌గా చూసుకుంటుంది సంధ్య. కోడ‌లిని త‌మ కూతురిగా భావిస్తున్న అత్తామామ‌లు సంధ్య‌కు మ‌ళ్లీ పెళ్లి చేయాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు. సంధ్య మాత్రం రెండో పెళ్లి అంగీక‌రించ‌దు. త‌న మ‌న‌సులో సూర్యానికి త‌ప్ప మ‌రొక‌రికి చోటు లేద‌ని అంటుంది.


అలాంటి సంధ్య జీవితంలోకి అనుకోకుండా ఆకాశ్ వ‌చ్చి ఆమెను పెళ్లి చేసుకోవాల‌ని ఆశ ప‌డ‌తాడు. సంధ్య కోసం మాధ‌వ‌రావు, ల‌క్ష్మీల‌తో ఆకాష్ స్నేహంగా ఉండ‌టం మొద‌లు పెడ‌తాడు. ఆకాష్ ప్రేమ విష‌యం సంధ్య‌కు తెలిసి ఏం చేసింది? అత‌డి ప్రేమ‌ను తిర‌స్క‌రించిందా? అంగీక‌రించిందా? ఇదివ‌ర‌కు సంధ్య‌కు సూర్యంతో పెళ్లి జ‌రిగింద‌నే నిజం తెలుసుకున్న త‌ర్వాత కూడా ఆకాష్ ఆమెను పెళ్లి చేసుకోవాల‌ని అనుకున్నాడా? లేదా అన్న‌దే ఈ సీరియ‌ల్ క‌థ‌. వ‌సంత కోకిల సీరియ‌ల్ సంధ్య పాత్ర‌లో ప‌ద్మ ల‌క్ష న‌టిస్తోండ‌గా ఆకాష్‌గా ర‌వి రాథోడ్‌, సూర్యం క్యారెక్ట‌ర్‌లో మ‌ధు క‌నిపించ‌బోతున్నారు. ఈ సీరియ‌ల్‌కు అనిల్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. అరుణ్ కుమార్ స్క్రీన్‌ప్లే స‌మ‌కూర్చుతున్నాడు.

maxresdefault.jpg

ఇక కాంతార (Kantara) సీరియ‌ల్ స్టోరీకి వ‌స్తే.. బుట్టాయ గూడేనికి చెందిన కాంతార‌, గోపి ఒక‌రినొక‌రు ప్రాణంగా ప్రేమించుకుంటారు. పెద్ద‌ల‌ను ఒప్పించిపెళ్లి చేసుకోవాల‌ని ఆశ‌ప‌డ‌తారు. కానీ అనుకోని ప‌రిస్థితుల్లో యువ‌రాజుతో కాంతార పెళ్లి జ‌రుగుతుంది. గోపిని కాద‌ని యువ‌రాజును కాంతార ఎందుకు పెళ్లి చేసుకున్న‌ది. ప్రియురాలికి మ‌రో యువ‌కుడితో పెళ్లి జ‌రిగింద‌నే నిజం తెలిసి గోపి ఏం చేశాడు. మ‌న‌సుకు మాంగ‌ల్యానికి మ‌ధ్య కాంతార ఎలా న‌లిగిపోయిందన్న‌దే కాంతార సీరియ‌ల్ క‌థ‌. కాంతార సీరియ‌ల్‌కు శ‌ర‌త్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. గౌర‌వ్‌, అక్ష‌య‌, ప‌వ‌న్ ర‌వీంద్ర కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.

Updated Date - Jul 02 , 2024 | 12:35 PM