TV actor Chandu : బుల్లితెర నటుడు చందు ఆత్మహత్య
ABN , Publish Date - May 18 , 2024 | 05:51 AM
బుల్లితెర నటుడు చందు ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. డిప్రెషన్తోనే ఆయన ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. శుక్రవారం హైదరాబాద్
బుల్లితెర నటుడు చందు ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. డిప్రెషన్తోనే ఆయన ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. శుక్రవారం హైదరాబాద్ మణికొండలోని ఆయన ఇంట్లో ఈ దుర్ఘటన జరిగింది. టీవీ నటి పవిత్ర జయరాం రోడ్డు ప్రమాదంలో చనిపోయాక చందు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు బ్రెయిన్కు సంబంధించిన వ్యాధి ఉందని, ఇంకొన్నాళ్లే బతుకుతానని చెప్పారు. ఆత్మహత్యకు ముందు ‘ఈ రోజు పవిత్ర పుట్టిన రోజు నన్ను రమ్మంటోంది అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. త్రినయని, కార్తీకదీపం లాంటి సీరియళ్లతో చందు నటుడిగా గుర్తింపు పొందారు. ఆయనకు భార్య శిల్ప, ఇద్దరు పిల్లలు ఉన్నారు.