Ram Charan - Surekha: పవన్ కల్యాణ్‌ కోసం పిఠాపురానికి..

ABN , Publish Date - May 10 , 2024 | 09:43 PM

గ్లోబల్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ (Ram Charan) శనివారం పిఠాపురం వెళ్లనున్నారు. తన తల్లి సురేఖతో (Surekha) కలిసి పిఠాపురంలోని కుక్కుటేశ్వర స్వామి (Kukuteswara swami) ఆలయాన్ని సందర్శించనున్నారు.

Ram Charan - Surekha: పవన్ కల్యాణ్‌ కోసం పిఠాపురానికి..

గ్లోబల్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ (Ram Charan) శనివారం పిఠాపురం వెళ్లనున్నారు. తన తల్లి సురేఖతో (Surekha) కలిసి పిఠాపురంలోని కుక్కుటేశ్వర స్వామి (Kukuteswara swami) ఆలయాన్ని సందర్శించనున్నారు. తన బాబాయ్‌, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ (pawan kalyan) ఆ నియోజకవర్గం నుంచి ఎమ్మేల్యేగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చరణ్‌ అక్కడికి వెళ్లనుండడం ప్రస్తుతం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే సోషల్‌ మీడియా వేదికగా చరణ్‌ పవన్‌కు మద్దతు తెలిపారు.  ‘మీ భవిష్యత్తు కోసం పాటుపడే నాయకుడు పవన్‌ కల్యాణ్‌ని గెలిపించండి’ అని విజ్ఞప్తి చేశారు. ఆలయంలో పూజలు అనంతరం చరణ్‌ ఎన్నికల ప్రచారం చేస్తారా లేదా అనే విషయం ఆసక్తికరంగా మారింది.

 
చిరంజీవి కూడా సపోర్ట్‌గా ఓ వీడియో నిలిచిన సంగతి తెలిసిందే! మెగా ఫ్యామిలీ హీరోలతోపాటు హీరో నాని, నిర్మాత నాగవంశీ, గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి  రాజ్‌ తరుణ్‌, జబర్దస్ట్‌ టీమ్‌, అలాగే తమిళ నటి శ్రియా రెడ్డి కూడా పవనకు మద్దతుగా ట్వీట్‌ చేశారు. గాజుగ్లాస్‌కి ఓటేయాలని, పిఠాపురంలో పవన్ గెలవాలని ఆమె పోస్ట్‌ చేశారు. సంగీత దర్శకుడు అనూప్‌ రూబెన్స్  కూడా పవనకు మద్దతు పలికారు. 

Updated Date - May 10 , 2024 | 09:43 PM