Tirupati Controversy: ల‌డ్డూ వివాదంపై పవన్ కళ్యాణ్‌కు ప్రకాశ్ రాజ్ కౌంటర్

ABN , Publish Date - Sep 20 , 2024 | 08:11 PM

తిరుమల లడ్డూ వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం ట్విట్టర్ ‘ఎక్స్’ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేయగా.. ఆ వ్యాఖ్యలకు నటుడు ప్రకాశ్ రాజ్ కౌంటర్ ఇస్తున్నట్లుగా చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. కేంద్రంలోని వారిని ప్రస్తావిస్తూ ప్రకాశ్ రాజ్ ఏమన్నారంటే..

Prakash Raj and Pawan Kalyan

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం దేశ రాజకీయాలలో హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. తిరుమల లడ్డూ వివాదంపై హిందూ సంఘాలు, శ్రీవారి భక్తులంతా వైసీపీ పార్టీని దుమ్మెత్తి పోస్తున్నారు. ఈ వివాదంలో ఒక్కో విషయం బయటికి వస్తుంటే.. అంతా షాక్ అవుతున్నారు. ఈ వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) ట్విట్టర్ ‘ఎక్స్’ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేయగా.. ఆ వ్యాఖ్యలకు నటుడు ప్రకాశ్ రాజ్ (Prakash Raj) కౌంటర్ ఇస్తున్నట్లుగా చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.

Also Read- ANR Award: ఈ ఏడాది ఏఎన్నార్ అవార్డ్ ఎవరికో చెప్పేసిన కింగ్ నాగార్జున


ముందుగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్వీట్ విషయానికి వస్తే.. ‘‘తిరుపతి బాలాజీ పవిత్ర ప్రసాదాన్ని కల్తీ చేయడం ఆలయ కమిటీ చేసిన ద్రోహం మరియు అతి పెద్ద పాపం. ఎలాంటి ఆలస్యం చేయకుండా వెంటనే చర్యలు తీసుకుని నిందితులను అరెస్ట్ చేయండి. ఈ విషయంలో హిందువులు తీవ్రంగా హర్టయ్యారు’’ అంటూ హిందూ ఐటీ విభాగం నుండి వచ్చిన ట్వీట్‌కు..‘‘తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు‌ను వినియోగించడం అనేది భక్తుల మనోభావాలను దెబ్బతీసింది. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీటీడీ బోర్డు ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. సాధ్యమైనంత కఠిన చర్యలు తీసుకోవడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఆలయాల్లో జరిగే అంశాల పర్యవేక్షణకు జాతీయస్థాయిలో సనాతన ధర్మరక్షణ బోర్డు ఏర్పాటు చేయాల్సిన సమయం ఆసన్నమైంది. సనాతన ధర్మానికి ఏ రూపంలో ముప్పు వచ్చినా మనమంతా కలిసి నిర్మూలించాలి’’ అని పవన్ కళ్యాణ్ స్పందించారు. పవన్ కళ్యాణ్ ఇచ్చిన సమాధానం సరైనదిగా ఉందని, జాతీయస్థాయిలో ‘సనాతన ధర్మరక్షణ బోర్డు’ అవసరం అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.


Prakash-raj.jpg

అయితే పవన్ కళ్యాణ్ ట్వీట్‌కు నటుడు ప్రకాశ్ రాజ్ కౌంటరేస్తూ.. ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్‌లో.. ‘‘డియర్ పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం లడ్డూ వివాదం జరుగుతున్న రాష్ట్రంలోనే మీరు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. దయచేసి విచారణ జరపండి. ఈ విషయంలో తప్పు చేసింది ఎవరో కనిపెట్టి వారిని కఠినంగా శిక్షించండి. అంతేకానీ, మీరు ప్రజలలో భయాందోళనలను పెంచి, దీన్నో జాతీయ స్థాయి సమస్యగా చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికే మనదేశంలో మతపరమైన ఉద్రిక్తతలు చాలానే ఉన్నాయి (కేంద్రంలో ఉన్న మీ మిత్రులకు ధన్యవాదాలు)’’ అని పేర్కొన్నారు. ప్రకాశ్ రాజ్ చేసిన ఈ ట్వీట్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. మీ వల్లే మతపరమైన ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయంటూ.. కొన్ని ఫొటోలను షేర్ చేస్తున్నారు.

Also Read- ANR100: ఏఎన్నార్‌ను స్మరించుకున్న చిరు, బాలయ్య

Also Read- Jani Master: నేరాన్ని అంగీకరించిన జానీ మాస్టర్.. రిమాండ్ రిపోర్ట్ ఇదే

Read Latest Cinema News

Updated Date - Sep 20 , 2024 | 08:11 PM