BigBoss Telugu 8: షాకింగ్ న్యూస్.. మణికంఠ ఔట్

ABN , Publish Date - Oct 20 , 2024 | 11:39 AM

బిగ్‌బాస్ ఏడో వారం ఎలిమినేషన్ ఆడియన్స్‌కి భారీ షాక్ ఇచ్చింది. కొందరికి ఆడియెన్స్ ఫేవరెట్ మరికొందరికి సింపతీ స్టార్ అయిన మణికంఠ ఎలిమినేట్ అయ్యాడు.

బిగ్‌బాస్ ఏడో వారం ఎలిమినేషన్ ఆడియన్స్‌కి భారీ షాక్ ఇచ్చింది. కొందరికి ఆడియెన్స్ ఫేవరెట్ మరికొందరికి సింపతీ స్టార్ అయిన మణికంఠ హౌస్ వదిలి వెళ్లినట్లు తెలుస్తుంది. ఈ వారం ఎలిమినేషన్ లో పృథ్వీ, నిఖిల్, మణికంఠ, నబీల్, యష్మీ, ప్రేరణ, గౌతమ్, తేజ, హరితేజ ఉండగా ఆడియెన్స్ మణికంఠని ఇంటికి పంపించేశారు. ఇటీవల ఎంట్రీ ఇచ్చిన వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లతో ఆట స్వరూపమే మారిపోయింది. దీంతో ఈ వారం ఎలిమినేషన్ ఆదివారం రాత్రి ప్రసారమవనున్న.. షూటింగ్ ఇప్పటికే పూర్తవడంతో మణికంఠ ఎలిమినేట్ అయిన వార్త బయటికి పాకేసింది. ఇంతకీ ఆడియెన్స్ ఎలిమినేట్ చేసేంత.. మణికంఠ ఏం చేశాడంటే..


లాస్ట్ వీక్ 'కిరాక్ సీత' ఎలిమినేషన్ అనంతరం హౌస్‌లో 9 మంది కంటెస్టెంట్స్ మిగిలారు. ఈ వారం ఫ్రెష్‌గా మొదలైన ఎలిమినేషన్ ప్రాసెస్ లో అవినాష్ ఒక్కడు మాత్రమే మణికంఠని నామినేట్ చేయడం విశేషం. ఇక ఆల్మోస్ట్ ప్రతి వారం నామినేట్ అవుతూ.. ఎలాగోలాగ నెట్టుకొస్తున్నమణికంఠకి ఈ వారం లక్ కలిసి రాలేదు. స్ట్రాంగ్ కంటెస్టెంట్లు అనుకున్న ప్రతొక్కరూ ఎలిమినేట్ అవుతుండటంతో బిగ్‌బాస్ ఆసక్తికరంగా మారుతోంది. ఈ వీక్ జరిగిన ఛార్జింగ్ టాస్క్‌ల్లో మణికంఠ "నేను ఆడను.. బొక్కలు ఇరగ్గొట్టుకోలేను.. నేను ఎలిమినేట్ అయిపోయినా ఫర్లేదు అంటూ ఓ పక్కన కూర్చున్నాడు". ఇదే మణికంఠ కొంప ముంచింది. ఇన్ని వారాలు ఎలాగొలాగో నెట్టుకొచ్చిన మని బాబు ఈ మాటతో ఔట్ అయిపోయాడు.


మరోవైపు మణికంఠ.. ఈవారం అందరితో అనవసరంగా గొడవ పెట్టుకుంటూ.. గేమ్‌పై ఫోకస్ చేయలేదు. ఇక ఎలిమినేషన్ ముందు మని బాబు నా మైండ్, హార్ట్ ఏం బాలేదు, ఇక్కడి నుంచి వెళ్ళిపోతా అంటూ ఎమోషనల్ అయినట్లు తెలుస్తుంది. ఈ ఎలిమినేషన్ లో నిఖిల్, నబీల్, ప్రేరణలు స్ట్రాంగ్ ఓటింగ్ మొదట సేవ్ అయ్యారు. తేజ, హరితేజ, పృథ్వీలు టాస్క్‌ల్లో రాణించటంతో సేవ్ అయ్యారు. ఇప్పటి వరకు కాస్త రిస్కీ పొజిషన్‌లో ఉన్న గౌతమ్ చెలరేగి ఆడటంతో మెగా చీఫ్ కావడంతో పాటు ఎలిమినేషన్ నుండి సేవ్ అయ్యాడు. దీంతో మణికంఠ ఎలిమినేషన్ అనివార్యం అయ్యింది.

Updated Date - Oct 20 , 2024 | 11:39 AM