Manchu Family: మంచు ఫ్యామిలీలో అసలేం జరుగుతోంది..

ABN , Publish Date - Sep 14 , 2024 | 10:57 PM

మంచు మోహన్ బాబు అనగానే క్రమశిక్షణకు మారుపేరు అని ఇండస్ట్రీలో చెబుతుంటారు. అలాంటి మోహన్ బాబు ఫ్యామిలీ ఈ మధ్యకాలంలో బాగా వార్తలలో వైరల్ అవుతోంది. తాజాగా మంచు మనోజ్ చేసిన ట్వీట్‌తో ఆ ఫ్యామిలీలో విభేదాలు నడుస్తున్నాయనేది మరోసారి స్పష్టమైంది. ఆ ట్వీటేంటో, అందులోని సారాంశం ఏమిటో తెలియాలంటే..

Manchu Family Heroes

మంచు మోహన్ బాబు (Manchu Mohan Babu) అనగానే క్రమశిక్షణకు మారుపేరు అని ఇండస్ట్రీలో చెబుతుంటారు. హీరోగా, విలన్‌గా ఎన్నో విలక్షణ పాత్రలలో నటించి నిర్మాతగా మారి ఎందరికో లైఫ్ ఇచ్చిన మోహన్ బాబు అంటే ఇండస్ట్రీలో అందరికీ గౌరవమే. కానీ ఈ మధ్య మాత్రం ఆయన ఫ్యామిలీ బాగా వార్తలలో నిలుస్తూ వస్తుంది. ఆ మధ్య ‘మా’ ఎన్నికల టైమ్‌లో ఓ రచ్చ అయితే.. మంచు మనోజ్ రెండో పెళ్లి విషయంలో మరోసారి ఈ ఫ్యామిలీ న్యూస్‌లో నలిగింది. మరీ ముఖ్యంగా మంచు విష్ణు (Manchu Vishnu), మంచు మనోజ్‌ (Manchu Manoj)ల బాండింగ్‌పై నానా రకాలుగా వార్తలు వైరల్ అయ్యాయి.. అవుతూనే ఉన్నాయి. అందుకు కారణం వారి నుంచి వచ్చిన ఓ వీడియోనే. అప్పటి నుంచి మంచు ఫ్యామిలీలో అంతా సవ్యంగా లేదనేది బాహ్య ప్రపంచానికి తెలిసింది. మంచు విష్ణు ఆ తర్వాత కవర్ చేయాలని చూసినా.. అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. ఇక ఇప్పుడు మంచు మనోజ్ ట్వీట్ చూస్తే.. కాంట్రవర్సీ అని అనిపించడం లేదు కానీ.. కనబడకుండా ఏదో ఆ ఫ్యామిలీలో అయితే జరుగుతుందనే అనుమానాలు ఆ ట్వీట్ మరింత బలపరుస్తోంది. విషయంలోకి వస్తే.. (Manchu Manoj Tweet)

Also Read- Thalapathy69: దళపతి విజయ్ చివరి చిత్ర ప్రకటన వచ్చేసింది..

తాజాగా మంచు మనోజ్ సోషల్ మీడియా వేదికగా ఓ ట్వీట్ చేశారు. అందులో.. తన తండ్రి పేరు మీద ఉన్న మోహన్ బాబు యూనివర్శిటీ, శ్రీవిద్యానికేతన్‌లపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చేస్తున్న ఆందోళనలను చూసి బాధ కలిగిందని, తన తండ్రి ఉన్నత విలువలతో విద్యాసంస్థలను స్థాపించారని.. రాయలసీమ సమాజ శ్రేయస్సుకు ఎల్లప్పుడూ ప్రాధాన్యతనిస్తూ ఉంటారని పేర్కొన్నారు. ఆయన దృష్టి మరియు అభిరుచిని దృష్టిలో ఉంచుకుని.. ఈ సమయంలో తల్లిదండ్రులు, విద్యార్థులు మరియు ఎఐఎస్ఎఫ్‌కీ పూర్తి మద్దతును అందించాలనుకుంటున్నానని.. అక్కడున్న పరిస్థితి, ఫిర్యాదుల విషయమై ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ వినయ్‌ని సంప్రదించి వివరణ అడిగానని, అతని సమాధానం కోసం వేచి చూస్తున్నానని తెలిపారు. దయచేసి ఏవైనా ఫిర్యాదులు ఉంటే పర్సనల్‌గా మెయిల్ పంపాలని కోరుతూ.. ఓ మెయిల్ ఐడీని పోస్ట్ చేసిన మనోజ్.. ఆ ఫిర్యాదులను తన తండ్రి దృష్టికి తీసుకువెళ్లి న్యాయం జరిగేలా చూస్తానని పేర్కొన్నారు. ఈ విషయంలో పూర్తి మద్దతు ఇవ్వడానికి కట్టుబడి ఉన్నానని ట్వీట్‌లో మనోజ్ చెప్పుకొచ్చారు.


Mohan-Babu.jpg

ప్రస్తుతం ఏ కాలేజీలపై, యూనివర్సిటీపై ఆరోపణలు వస్తున్నాయో.. అవన్నీ మంచు విష్ణు ఆధ్వర్యంలోనే ఉన్నాయి. తన అన్న నిర్వహణలో ఉన్న విద్యాసంస్థలపై ఆరోపణలు వస్తే ఖండించాల్సిన మనోజ్.. రివర్స్‌లో ఆ ఆరోపణలు చేస్తున్న వారికి మద్దతు ఇవ్వడం అంటే ఇది మరోసారి మనోజ్ ఘట్స్‌ని తెలియజేస్తుంది. అదే సమయంలో వారి ఫ్యామిలీలో విభేదాలు నడుస్తున్నాయనే హింట్‌ను కూడా ఇస్తోంది. శ్రీవిద్యానికేతన్, మోహన్ బాబు యూనివర్శిటీలకు సంబంధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రీసెంట్‌గా మీడియా సమావేశం నిర్వహించి అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్లుగా ఆరోపణలు చేశారు. అలాగే ఏఐసీటీఈకి కూడా ఫిర్యాదు చేశారు. కానీ ఆయా సంస్థలు మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు. ఈ క్రమంలో మంచు మనోజ్ ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రస్తావించడంతో.. విషయం చాలా దూరం వెళ్లే అవకాశం అయితే లేకపోలేదు. దీనిపై పెద్దాయన మోహన్ బాబు, అలాగే మంచు విష్ణు ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.

Also Read- Jr NTR: ‘దేవర’ చూసే వరకు బ్రతికించమన్న అభిమాని కోసం ఎన్టీఆర్ ఏం చేశారంటే..

Also Read- Love Sitara: పెళ్లికి ముందే నిజాలు బయటపడ్డాయ్.. శోభితా ధూళిపాళ పెళ్లి అవుతుందా?

Read Latest Cinema News

Updated Date - Sep 14 , 2024 | 10:57 PM