Kiraak RP: లడ్డు వివాదం.. వైఎస్ జగన్‌పై కిరాక్ ఆర్పీ సంచలన కామెంట్స్

ABN , Publish Date - Sep 24 , 2024 | 04:34 PM

తిరుమల కొండపై కొలువు తీరిన శ్రీవెంకటేశ్వరుని లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం జరిగినట్లు ఎన్‌డీడీబీ తన నివేదికలో స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో తీవ్ర దుమారం చెలరేగుతోంది. తాజాగా జబర్ధస్త్ కమెడియన్ కిరాక్ ఆర్పీ మీడియా సమావేశం నిర్వహించి మాజీ సీఎం జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కిరాక్ ఆర్పీ ఏమన్నారంటే..

Kiraak RP

తిరుమల కొండపై కొలువు తీరిన శ్రీవెంకటేశ్వరుని లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం జరిగినట్లు ఎన్‌డీడీబీ తన నివేదికలో స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో తీవ్ర దుమారం చెలరేగుతోంది. శ్రీవారి భక్తులు, హిందూ సంఘాలు ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నాయి. తాజాగా జబర్ధస్త్ కమెడియన్ కిరాక్ ఆర్పీ (Kiraak RP) మీడియా సమావేశం నిర్వహించి.. ఈ లడ్డూ కాంట్రవర్సీ (Laddoo Controversy) విషయంలో మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy)పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Also Read- Hero Karthi పవన్‌ స్వీట్‌ వార్నింగ్‌కు కార్తి స్పందన


ఈ కార్యక్రమంలో కిరాక్ ఆర్పీ మాట్లాడుతూ.. ‘‘వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే నేను తిరుమల అక్రమాలపై మాట్లాడాను. అన్న ప్రసాదం, లడ్డు ప్రసాదం నాశనం చేశారు. పూజారులను ఇబ్బంది పెట్టారు. అన్యమత ప్రచారాలు చేశారు. కొండపై మాంసం తింటూ, మద్యం తాగుతూ రియల్ ఎస్టేట్ వ్యవహారాలు నడిపారు. భక్తులకు క్యూలైన్‌లో ఎలాంటి సౌకర్యాలు లేకుండా చేశారు. జైలులో పెట్టిన పరిస్థితిని కల్పించారు. అమ్మో తిరుమల అనే స్థాయికి అన్నింటినీ దిగజార్చారు.


Tirumala-Laddu.jpg

లడ్డులో జంతు కొవ్వు కలిపారన్నది నమ్మి తీరాల్సిందే. ఇండియాలోని బెస్ట్ ల్యాబ్‌లో టెస్ట్ చేశారు. లడ్డు క్వాలిటీ‌పై అనుమానం వచ్చి టెస్ట్ చేయటం జరిగింది. లడ్డు పోస్ట్ మార్టం రిపోర్ట్‌లో దారుణ విషయాలు బయట పడ్డాయి. నెయ్యి కల్తీ చేసినా కేజీ 350కి రాదు. అలాంటిది జంతు కొవ్వు కలిపిన నెయ్యిని లడ్టులో వాడారు. ఏడుకొండలపై ఏసునాధుడిని పెట్టాలన్నదే జగన్ ఆలోచన. అందుకే ఇలాంటి పనులు చేశాడు. ఏడుకొండలపై వెలిసిన స్వామి అంటే ప్రపంచ వ్యాప్తంగా పేరుంది. ఇప్పటి వరకు ఎంతోమంది సీఎంలు వచ్చినా, తిరుమల పవిత్రతను కాపాడారు తప్ప దిగజార్చలేదు‌. కానీ తిరుమలలో జగన్ నీచాతినీచమైన పనులు, రాజకీయాలు చేశాడు. (Kiraak RP Comments on YS Jagan)

ఇంకా శ్రీవారి భక్తులపై వైసీపీ వాళ్లు రౌడీయిజం చేశారు. చాలామందిపై కొండపైనే భౌతిక దాడులు చేశారు. క్రిష్టియానిటీ కోసమే జగన్ ఇదంతా చేశాడు. వైసీపీ అధికారంలో ఉండగా ఎన్నో దేవాలయాలపై దాడులు జరిగాయి. జగన్‌కు కేవలం‌ హిందూమతం నాశనం చేయాలన్నదే టార్గెట్. ఇకనైనా ప్రతి ఒక్క హిందువూ మెల్కొని జగన్ చేసిన అరాచకాలను ప్రశ్నించాలి. కొన్ని వైసీపీ కుక్కలు ఇంకా జగన్‌ను వెనకేసుకొని వస్తున్నాయి. అలాంటివారు కచ్చితంగా హిందూ ధర్మానికి వ్యతిరేకులు. మీరు చేసిన పాపాలకు కుటుంబాలు నాశనం అవుతాయి..’’ అంటూ కిరాక్ ఆర్పీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Also Read- Pawan Vs Prakash Raj: పవన్‌కల్యాణ్‌కు ప్రకాశ్‌రాజ్‌ కౌంటర్‌

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Sep 24 , 2024 | 05:23 PM