Vijay Sethupathi : విజయ్‌ సేతుపతి 50వ మైలు రాయి

ABN , Publish Date - Jun 08 , 2024 | 05:15 AM

తమిళ నటుడు విజయ్‌ సేతుపతి 50వ చిత్రం ‘మహారాజా’ విడుదలకు సిద్ధమైంది. నితిలన్‌ స్వామినాథన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో

Vijay Sethupathi : విజయ్‌ సేతుపతి 50వ మైలు రాయి

తమిళ నటుడు విజయ్‌ సేతుపతి 50వ చిత్రం ‘మహారాజా’ విడుదలకు సిద్ధమైంది. నితిలన్‌ స్వామినాథన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనురాగ్‌ కశ్యప్‌ ఓ పవర్‌ఫుల్‌ పాత్ర పోషించారు. భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్వీఆర్‌ సినిమా సంస్థ ఈ నెల 14న విడుదల చేస్తోంది. ప్రమోషన్స్‌లో భాగంగా సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్‌ చివర్లో విజయ్‌ని ఎదుర్కొనేందుకు అనురాగ్‌ కశ్యప్‌ రావడం ఆసక్తి పెంచింది. మమతా మోహన్‌దాస్‌, భారతీరాజా, నటరాజన్‌ సుబ్రహ్మణ్యం, సింగంపులి కల్కి కీలక పాత్రలను పోషించారు. ఈ చిత్రానికి దినేశ్‌ పురుషోత్తమన్‌ సినిమాటోగ్రఫీనీ, అజనీశ్‌ లోకనాథ్‌ సంగీతాన్ని అందించారు.

Updated Date - Jun 08 , 2024 | 05:15 AM