పెళ్లి పనులు మొదలయ్యాయి...

ABN , Publish Date - Oct 22 , 2024 | 02:24 AM

అక్కినేని నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల త్వరలో పెళ్టి పీటలెక్కనున్న విషయం తెలిసిందే. ఇటీవల వీరి నిశ్చితార్థం వేడుకగా జరిగింది. తాజాగా పెళ్లి పనులు మొదలయ్యాయి. పసుపు దంచుతున్న ఫొటోలను...

అక్కినేని నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల త్వరలో పెళ్టి పీటలెక్కనున్న విషయం తెలిసిందే. ఇటీవల వీరి నిశ్చితార్థం వేడుకగా జరిగింది. తాజాగా పెళ్లి పనులు మొదలయ్యాయి. పసుపు దంచుతున్న ఫొటోలను శోభిత తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్‌ చేశారు. ‘గోధుమరాయి పసుపు దంచడంతో పనులు ప్రారంభమయ్యాయి’ అని క్యాప్షన్‌ పెట్టారు. ఎరుపు రంగు పట్టు చీరలో శోభిత సంప్రదాయబద్దంగా మెరిసిపోతూ కనిపించారు. తాను ధరించిన చీర అత్తగారైన లక్ష్మీ(నాగ చైతన్య తల్లి) ఇచ్చారని శోభిత కామెంట్స్‌లో పేర్కొన్నారు. ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి. పెళ్లి ఎక్కడ, ఎప్పుడు అనేది ఇంకా వెల్లడించలేదు. ఈ ఫోటోలు చూసిన అభిమానులు అదే ప్రశ్న అడుగుతున్నారు.

Updated Date - Oct 22 , 2024 | 02:25 AM