సీఎం రేవంత్రెడ్డిని కలసిన సాయి దుర్గాతేజ్
ABN , Publish Date - Jul 15 , 2024 | 02:56 AM
హీరో సాయిదుర్గాతేజ్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్దిని ఆదివారం కలిశారు. ఇటీవల సోషల్ మీడియాలో పిల్లలపై జరుగుతున్న అసభ్యకరమైన కామెంట్లను ఖండిస్తూ.. దుర్గాతేజ్ ఎక్స్లో ప్రణీత్ హనుమంతు అనే...
హీరో సాయిదుర్గాతేజ్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్దిని ఆదివారం కలిశారు. ఇటీవల సోషల్ మీడియాలో పిల్లలపై జరుగుతున్న అసభ్యకరమైన కామెంట్లను ఖండిస్తూ.. దుర్గాతేజ్ ఎక్స్లో ప్రణీత్ హనుమంతు అనే యూట్యూబర్పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరిన సంగతి తెలిసిందే. దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి స్పందించగా, ప్రణీత్తో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ముఖ్యమంత్రితో పాటు తెలంగాణ ప్రభుత్వం సకాలంలో తన అభ్యర్థనకు స్పందించిన తీరుకు కృతజ్ఞతగా సాయి దుర్గ తేజ్ ముఖ్యమంత్రిని కలిసి తన అభినందనలు తెలియజేశారు. ‘‘ఈ భేటీలో పిల్లలపై అసభ్యరంగా కామెంట్లు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రిని కోరాను. ఆయన సానుకూలంగా స్పందించారు’’ అని ఎక్స్లో సాయిదుర్గాతేజ్ పోస్ట్ చేశారు.