Ram Charan: రాజమండ్రి నుండి పిఠాపురం బయలుదేరిన రామ్ చరణ్, అభిమానుల ఘన స్వాగతం

ABN , Publish Date - May 11 , 2024 | 12:23 PM

బాబాయి కోసం అబ్బాయి రామ్ చరణ్ పిఠాపురం బయలుదేరారు. రాజమండ్రి విమానాశ్రయంలో ఈరోజు ఉదయం అడుగుపెట్టిన రామ్ చరణ్ కి అభిమానుల ఆనందోత్సాహాల మధ్య అపూర్వ ఘన స్వాగతం లభించింది. అక్కడ నుండి పిఠాపురం బయలుదేరి, ముందుగా కుక్కుటేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు

Ram Charan: రాజమండ్రి నుండి పిఠాపురం బయలుదేరిన రామ్ చరణ్, అభిమానుల ఘన స్వాగతం
Ram Charan in Rajahmundry and on the way to Pithapuram

జనసేన అధినేత, నటుడు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంపైనే అందరి దృష్టి వుంది. పవన్ కళ్యాణ్ కి తెలుగు చలన చిత్ర పరిశ్రమ నుండి ఎంతోమంది నటీనటులు తమ సంఘీభావాన్ని తెలుపుతూ తమ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతూ వున్నారు. ఇంకోపక్క అవకాశం వున్నవారు పిఠాపురం వెళ్లి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ పవన్ కళ్యాణ్ ని గెలిపించాల్సిందిగా వోటర్లకి విజ్ఞప్తి చేస్తున్నారు. (Mega Power Star Ram Charan landed in Rajahmundry and on the way to Pithapuram)

ramcharanlanded.jpg

ఈరోజు పవన్ కళ్యాణ్ బాబాయ్ కోసం, చిరంజీవి తనయుడు రామ్ చరణ్ ఇప్పటికే రాజమహేంద్రవరం చేరుకున్నారు. కొద్దిసేపటిలో అతను కుక్కుటేశ్వర దేవాలయాన్ని సందర్శించి ఆ తరువాత పిఠాపురంలో పర్యటించనున్నారని తెలిసింది. రామ్ చరణ్ తో పాటు, అతని తల్లి సురేఖ కూడా పిఠాపురం ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం వుంది అని తెలుస్తోంది.

ramcharanlandedinrjyone.jpg

రామ్ చరణ్ గత కొన్ని రోజులుగా చాలా బిజీగా వున్నారు. తన సినిమా 'గేమ్ చేంజర్' సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఇంకోపక్క తన తండ్రి మెగా స్టార్ చిరంజీవి పద్మవిభూషణ్ బిరుదుని రాష్ట్రపతి నుండి ఢిల్లీలో అందుకున్నారు. ఆ వేడుకలో కూడా తండ్రితో పాటు రామ్ చరణ్, అతని భార్య ఉపాసన పాల్గొన్నారు.

ramcharaninrajahmundryone.jpg

ఢిల్లీ నుండి హైదరాబాదు తిరిగి వచ్చి ఈరోజు పిఠాపురంకి బయలుదేరారు, ముందుగా రాజమహేంద్రవరం విమానాశ్రయంలో దిగారు. అక్కడ మెగా అభిమానులు పెద్ద ఎత్తున రామ్ చరణ్ కి స్వాగతం పలికారు. మెగా అభిమానులతో పాటు, జనసేన కార్యకర్తలు కూడా విమానాశ్రయానికి వచ్చి రామ్ చరణ్ కి స్వాగతం పలికారు. (Ram Charan is on the way to Pithapuram from Rajahmundry Air Port)

Updated Date - May 11 , 2024 | 01:02 PM