Manmayi: ఎమోషనల్ రోలర్ కోస్టర్ ‘మన్మయి’ టీజర్ విడుదల

ABN , Publish Date - Aug 07 , 2024 | 05:20 PM

G2H మీడియా పతాకంపై సంతోష్ కృష్ణ, వైష్ణవి కృష్ణ, సిజు మీనన్ ప్రధాన పాత్రధారులుగా పులుగు రామకృష్ణారెడ్డి దర్శకత్వంలో.. నిర్మాతలు రామకృష్ణారెడ్డి, శ్రీహరి రెడ్డి, కిరణ్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఎమోషనల్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘మన్మయి’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్ర టీజర్‌ని బుధవారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో జరిగిన కార్యక్రమంలో నిర్మాత రాజ్ కందుకూరి చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు.

Manmayi Movie Teaser Launch Event

G2H మీడియా పతాకంపై సంతోష్ కృష్ణ, వైష్ణవి కృష్ణ, సిజు మీనన్ ప్రధాన పాత్రధారులుగా పులుగు రామకృష్ణారెడ్డి దర్శకత్వంలో.. నిర్మాతలు రామకృష్ణారెడ్డి, శ్రీహరి రెడ్డి, కిరణ్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఎమోషనల్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘మన్మయి’ (Manmayi Movie). అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్ర టీజర్‌ని బుధవారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో జరిగిన కార్యక్రమంలో నిర్మాత రాజ్ కందుకూరి (Raj Kandukuri) చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నటుడు నాగ మహేష్, కరెన్ సింగ్, జయంత్, యోగి తదితరులు పాల్గొన్నారు. (Manmayi Movie Teaser Launched)

Also Read- Prabhas: ప్రభాస్ ఫర్ ఏ రీజన్.. వయనాడ్ బాధితుల సహాయార్థం భారీ విరాళం

టీజర్ విడుదల అనంతరం నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. ‘మన్మయి’ టీజర్ లాంఛ్‌కు రమ్మని ఇన్వైట్ చేస్తూ.. డైరెక్టర్ రామకృష్ణారెడ్డి సినిమాకు సంబంధించిన కొన్ని స్టిల్స్ చూపించారు. స్టిల్స్ చూడగానే బాగున్నాయనిపించింది. ఇక్కడకి వచ్చి టీజర్ చూశాక మంచి కంటెంట్‌తో ఈ సినిమా చేస్తున్నట్లు అర్థమైంది. ‘మన్మయి’ సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందాలి. మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ అని అన్నారు.


Manmayi.jpg

హీరో సంతోష్ కృష్ణ మాట్లాడుతూ.. నాకు ఈ మూవీలో నటించే అవకాశం ఇచ్చిన మా బ్రదర్ రామకృష్ణా రెడ్డికి థ్యాంక్స్. మా ‘మన్మయి’ మూవీ టీజర్ స్క్రీన్ మీద చూస్తూ అందరూ చప్పట్లు కొడుతుంటే చాలా సంతోషంగా అనిపించింది. మీకు టీజర్ నచ్చిందంటే మా వర్క్ నచ్చిందనే భావిస్తున్నాం. ఇది ఒక ఎమోషనల్ మూమెంట్ మా అందరికీ. మనసుకు హత్తుకునే మంచి లవ్ స్టోరీతో మీ ముందుకు త్వరలోనే రాబోతున్నామని అన్నారు. హీరోయిన్ వైష్ణవి కృష్ణ మాట్లాడుతూ.. ఇందులో అన్ని ఎమోషన్స్ ఉంటాయని, తెలుగు మూవీస్‌లో ఒక క్లాసిక్‌గా ఈ మూవీ మిగిలిపోతుందని అన్నారు.

డైరెక్టర్ పులుగు రామకృష్ణారెడ్డి (Pulugu Ramakrishna Reddy) మాట్లాడుతూ.. మా సినిమా టీజర్ విడుదల చేసిన నిర్మాత రాజ్ కందుకూరికి థ్యాంక్స్. మా టీజర్ లాంఛ్ ఈవెంట్‌కు వచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ‘మన్మయి’ ఒక ఎమోషనల్ లవ్ ఎంటర్‌టైనర్. ప్రేక్షకులకు ఒక మంచి అనుభూతిని పంచే సినిమా అవుతుంది. మంచి మూవీ చేశామనే అనుకుంటున్నాం. ఈ సినిమా విషయంలో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ‘మన్మయి’కి ప్రేక్షకుల ఆశీస్సులు కావాలని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో నిర్మాతలు శ్రీహరి రెడ్డి, కిరణ్ రెడ్డి.. నటుడు శిజు, తదితరులు ప్రసంగిస్తూ.. ఈ ఎమోషనల్ రోలర్ కోస్టర్ మంచి విజయం సాధించాలని కోరారు.

Read Latest Cinema News

Updated Date - Aug 07 , 2024 | 05:20 PM