ట్రోలర్స్పై డీజీపీకి ‘మా’ ఫిర్యాదు
ABN , Publish Date - Jul 19 , 2024 | 01:59 AM
సోషల్ మీడియా వేదికల ద్వారా సినిమా తారలపై జరుగుతున్న ట్రోలింగ్పై ‘మా’ (మూవీ ఆర్టిస్ట్ ఆసోసియేషన్) చర్యలకు సిద్థమైంది. ఈ నేపథ్యంలో భాగంగా ‘మా’ సభ్యులైన శివ బాలాజీ, రాజీవ్ కనకాల, శివకృష్ణ తెలంగాణ డీజీపీ జితేందర్ను...
సోషల్ మీడియా వేదికల ద్వారా సినిమా తారలపై జరుగుతున్న ట్రోలింగ్పై ‘మా’ (మూవీ ఆర్టిస్ట్ ఆసోసియేషన్) చర్యలకు సిద్థమైంది. ఈ నేపథ్యంలో భాగంగా ‘మా’ సభ్యులైన శివ బాలాజీ, రాజీవ్ కనకాల, శివకృష్ణ తెలంగాణ డీజీపీ జితేందర్ను కలసి వినతి పత్రం అందించారు. అందులో ఈ ట్రోలింగ్స్కు పాల్పడుతున్న 250 యూట్యూబ్ చానళ్లపై చర్యలు తీసుకోవాలని ‘మా’ సభ్యులు డీజీపీని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన డీజీపీ.. సైబర్ సెక్యూరిటీ సహకారంతో ఈ అంశంపై చర్యలు తీసుకోవడానికి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తామని.. అందులో ఇటువంటి ట్రోలర్స్పై నిఘా పెడతామని ‘మా’ సభ్యులకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ‘మా’ సభ్యులు మాట్లాడుతూ ‘‘ఈ ట్రోలింగ్స్ హద్దులు దాటిపోయాయి. వీటి వల్ల చాలా మంది నటీనటులు ఇబ్బంది పడుతున్నారు. 24 గంటల్లోపు ఓ ప్రత్యేక కో ఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేసి ట్రోలింగ్ చేసే చానళ్లను గుర్తిస్తాం’’ అని చెప్పారు.