Nabha Natesh: చాలా కాలం తరువాత ఇస్మార్ట్ శంకర్ భామకి సినిమా

ABN , Publish Date - Apr 04 , 2024 | 10:39 AM

సుమారు మూడేళ్ళ గ్యాప్ తరువాత నభా నటేష్ కెమెరా ముందుకు వచ్చింది. నిఖిల్ సిద్ధార్థ కథానాయకుడిగా వస్తున్న 'స్వయంభు' సినిమాలో నభా నటేష్ ని తీసుకుంటున్నట్టుగా ఈరోజు అధికారికంగా ప్రకటన వెలువడింది. భరత్ కృష్ణమాచారి ఈ సినిమాకి దర్శకుడు.

Nabha Natesh: చాలా కాలం తరువాత ఇస్మార్ట్ శంకర్ భామకి సినిమా
Nabha Natesh

కన్నడ నటి నభా నటేష్ తెలుగులో 'నన్ను దోచుకుందువటే' సినిమాతో పరిచయం అయింది. సుధీర్ బాబు కథానాయకుడు, ఈ సినిమాతో నభాకి మంచి పేరు వచ్చింది. ఆమె నటనలో కూడా పరిణితి చూపించింది మొదటి సినిమాతో. ఆ తరువాత పూరి జగన్నాథ్, రామ్ పోతినేని కాంబినేషన్ లో వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమాలో కథానాయకురాలిగా చేసింది. ఆ సినిమా చాలా పెద్ద విజయం సాధించింది. రామ్ పోతినేనికి, పూరి జగన్ కి ఆ సినిమా పూర్వ వైభవాన్ని తెచ్చి పెట్టింది.

nabhanateshone.jpg

అందులో చేసిన నభా నటేష్ కూడా ఇక వరస అవకాశాలు వస్తాయని పరిశ్రమలో టాక్ కూడా వచ్చింది. కానీ ఆసక్తికరంగా 2019లో వచ్చిన ఆ సినిమా తరువాత నభాకి అంత పెద్ద అవకాశాలు రాలేదనే చెప్పాలి. రవి తేజ పక్కన చేసిన 'డిస్కో రాజా' ఫ్లాప్ అయింది, తరువాత వచ్చిన 'సోలో బ్రతుకే సో బెటర్' లో సాయి ధరమ్ తేజ్ పక్కన నటించింది. ఆ సినిమా బాగానే ఆడింది. 2021లో వచ్చిన 'అల్లుడు అదుర్స్', 'మాస్ట్రో' సినిమాలో నటించిన నభాకి ఇంతవరకు ఒక్క సినిమా అవకాశాం కూడా రాలేదు. అయితే ఈ మధ్యలోనే ఆమెకి ఒక ప్రమాదం జరగటం ఆమె అందుకోసమని కొన్నాళ్ల పాటు విశ్రాంతి తీసుకోవటం జరిగింది.

Glamour Photos: చూపులతోనే తినేస్తోన్న నభా నటేష్

nabhanatesh.jpg

ఇప్పుడు అంటే సుమారు మూడేళ్ళ తరువాత నభా నటేష్ కి ఒక సినిమా అవకాశం వచ్చింది. నిఖిల్ సిద్ధార్థ్, దర్శకుడు భరత్ కృష్ణమాచారితో 'స్వయంభు' అనే ఒక పీరియడ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో సంయుక్త మీనన్ కథానాయికగా ఎప్పుడో ఎంపికైంది. ఈ సినిమాలో ఇప్పుడు నభా నటేష్ కూడా ఒక ముఖ్య పాత్ర చేస్తున్నట్టుగా ఈరోజు అధికారికంగా ప్రకటించారు. ఇది ఒక పీరియడ్ డ్రామా కాబట్టి, నభా నటేష్ లుక్ కూడా అలానే వుంది. ఈ సినిమాతో మళ్ళీ నభా చాలా కాలం తరువాత కెమెరా ముందుకు వచ్చారు.

Updated Date - Apr 04 , 2024 | 10:39 AM