Love Reddy: ఆంధ్ర కర్ణాటక బోర్డర్‌లో‌ జరిగే స్వచ్ఛమైన ప్రేమకథ.. టీజర్ వచ్చేసింది

ABN , Publish Date - Oct 03 , 2024 | 03:57 PM

గీతాన్స్ ప్రొడక్షన్స్, సెహెరి స్టూడియో, ఎమ్జీఆర్ ఫిలిమ్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘లవ్ రెడ్డి’. కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఆంధ్ర కర్ణాటక బోర్డర్‌లో జరిగే స్వచ్ఛమైన ప్రేమకథగా దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తాజాగా ఈ చిత్ర టీజర్‌ని మేకర్స్ వదిలారు. ఈ సినిమా గురించి యూనిట్ ఏం చెప్పారంటే..

Love Reddy Movie Still

గీతాన్స్ ప్రొడక్షన్స్, సెహెరి స్టూడియో, ఎమ్జీఆర్ ఫిలిమ్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘లవ్ రెడ్డి’. అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి హీరో‌హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకొని.. అక్టోబర్ 18న థియేటర్స్‌లోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఆంధ్ర కర్ణాటక బోర్డర్‌లో జరిగే స్వచ్ఛమైన ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ సినిమాతో స్మరన్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సునంద బి.రెడ్డి, హేమలత రెడ్డి, రవీందర్ జి, మదన్ గోపాల్ రెడ్డి, నాగరాజ్ బీరప్ప, ప్రభంజన్ రెడ్డి, నవీన్ రెడ్డి నిర్మాతలుగా సుమ, సుస్మిత, హరీష్, బాబు, రవి కిరణ్, జకరియా సహా నిర్మాతలుగా ఈ సినిమాను నిర్మించారు. తాజాగా ఈ చిత్ర టీజర్‌ని మేకర్స్ విడుదల చేశారు.

Also Read- King Nagarjuna: వెనక్కి తీసుకోండి.. కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలపై నాగార్జున

ఈ టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉండటమే కాకుండా.. న్యూ ఫీల్‌‌ని ఇస్తోంది. ఇక ఈ టీజర్ విడుదల సందర్భంగా హీరో అంజన్ రామచంద్ర మాట్లాడుతూ.. మీడియా వారే మా ‘లవ్ రెడ్డి’ సినిమా టీజర్‌ను విడుదల చేయడం సంతోషంగా ఉంది. ఈ సినిమా తప్పకుండా సంచలనాన్ని సృష్టిస్తుంది. మంచి సినిమాలు తప్పకుండా విజయం సాధిస్తాయని నమ్మకం ఉంది. అందరిలాగే మేము కూడా కష్టపడి చేశాము, ఆడియన్స్ సినిమా చూశాక తప్పకుండా ఈ సినిమాతో కొంతకాలం జర్నీ చేస్తారు, సినిమా ఎండింగ్‌లో ఒక గొప్ప ఫీల్‌తో బయటికి వస్తారు. అక్టోబర్ 18న థియేటర్లలోకి రానున్న మా సినిమాకు అంతా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానని అన్నారు.


Love-Reddy.jpg

డైరెక్టర్ స్మరన్ మాట్లాడుతూ.. ‘‘ మా టీమ్‌ని, సినిమాని ఎంకరేజ్ చేస్తున్న మీడియా వారందరికీ కృతజ్ఞతలు. ‘లవ్ రెడ్డి’ సినిమా ఇంతవరకు వచ్చింది అంటే అందుకు కారణం హీరో అంజన్ రామచంద్ర. మా మధ్య చాలా జర్నీ ఉంది, మేము కలిసి షార్ట్ ఫిలిమ్స్ చేశాము, ఇప్పుడు సినిమాతో మీ ముందుకు వస్తున్నాను. హీరోయిన్ శ్రావణి చాలా బాగా నటించింది, అందరూ కష్టపడి చేసిన సినిమా ఇది. సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరూ ది బెస్ట్ ఇచ్చారు. మైత్రీ వారు మా సినిమాను విడుదల చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. నిర్మాతలో ఒకరైన మదన్ మాట్లాడుతూ.. ఈ సినిమా హీరో అంజన్ రామచంద్ర, డైరెక్టర్ స్మరన్ జర్నీ పది ఏళ్ల నుండి ఉంది. వారిద్దరూ కలిసి చేస్తున్న సినిమా ‘లవ్ రెడ్డి’. మంచి కంటెంట్‌తో వస్తోన్న సినిమా ఇది. అక్టోబర్ 18న వస్తున్న ఈ సినిమాను అంతా థియేటర్లలో చూసి ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నానని చెప్పుకొచ్చారు.

Also Read- Samantha: కొండా సురేఖ కాంట్రవర్సీ వ్యాఖ్యలపై సమంత స్ట్రాంగ్ కౌంటర్

Also Read- Tollywood: సినిమాల కరువులో.. టాలీవుడ్ భామలు

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Oct 03 , 2024 | 03:57 PM