Sapthami Gowda: శ్రీదేవి భైరప్పపై కాంతారా హీరోయిన్ పరువునష్టం కేసు

ABN , Publish Date - Jun 18 , 2024 | 11:10 AM

యువ రాజ్ కుమార్ భార్య శ్రీదేవిపై కాంతారా హీరోయిన్ సప్తమి గౌడ పరువునష్టం కేసు వేసింది. తనపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు రూ.10 కోట్లు నష్టపరిహారం చెల్లించాలని, మీడియా ముఖంగా బహిరంగంగా తనకి క్షమాపణ చెప్పాలని సప్తమి గౌడ తన పిటిషన్ లో పేర్కొంది.

Sapthami Gowda: శ్రీదేవి భైరప్పపై కాంతారా హీరోయిన్ పరువునష్టం కేసు
Sapthami Gowda

కన్నడ చిత్ర పరిశ్రమలో ఈమధ్య సంచలన సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ప్రముఖ నటుడు దర్శన్ అరెస్టు ఒకవైపు సంచలనం సృష్టించగా, ఇంకోవైపు కన్నడ నటుడు యువ రాజ్ కుమార్ విడాకుల కేసు ఇంకా సంచలనం సృష్టిస్తోంది. యువ రాజ్ కుమార్ ఎవరో కాదు, దివంగత లెజండరీ నటుడు, కన్నడ కంఠీరవ అని బిరుదు పొందిన రాజ్ కుమార్ మనవడు. రాఘవేంద్ర రాజ్ కుమార్ కుమారుడు యువ నటుడు అయిన యువ రాజ్ కుమార్ తన భార్య శ్రీదేవి నుంచి విడాకులు కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు, ఇప్పుడు ఈ వార్త సంచలనం అయింది. (Kantara fame actress Sapthami Gowda filed a defemation case against Sridevi Byrappa for her comments)

yuvarajkumarsridevibyrappa.jpg

యువ రాజ్ కుమార్ తన భార్యకి విడాకుల నోటీసులు పంపిన నాటి నుంచి యువరాజ్ కుమార్ భార్య శ్రీదేవి రోజుకొక సంచలన ఆరోపణలు చేస్తున్నారు. తమ విడాకుల వివాదానికి కాంతారా ఫేమ్ నటి సప్తమి గౌడ‌ కారణమంటూ శ్రీదేవి ఆరోపిస్తున్నారు. తన భర్తకి సప్తమి గౌడతో అక్రమ సంబంధం ఉందంటూ శ్రీదేవి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. సప్తమి గౌడ, తన భర్త యువ రాజ్ కుమార్ ప్రేమలో ఉన్నారని, తాను అమెరికా ఉన్నప్పుడు, వీరిద్దరూ సహజీవనంలో ఉన్నారని కూడా శ్రీదేవి చెప్పుకొచ్చారు. (Yuva Rajkumar and Sridevi Byrappa divorce case turns into a new angle)

Sapthami Gowda

అయితే ఈ ఆరోపణలపై నటి సప్తమి గౌడ చాలా సీరియస్ అయింది. శ్రీదేవి భైరప్పపై కోర్టులో కేసు కూడా వేసింది. తన పరువుకి నష్టం కలిగించే ఆరోపణలు చేయకుండా ఆమెపై చర్యలు తీసుకోవాలని సప్తమి గౌడ తన పిటిషన్‌లో కోరింది. శ్రీదేవికి నోటీసులు జారీ చేయాలని బెంగళూరు సిటీ సివిల్ కోర్టు ఆదేశించింది. ఎలాంటి రుజువులు లేకుండా తనపై ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదని, వీటి వల్ల తన పరువకి నష్టం వాటిల్లడంతో రూ.10 కోట్లు చెల్లించాలని సప్తమి కోరింది. అలానే శ్రీదేవి మీడియా ముఖంగా బహిరంగంగా తనకి క్షమాపణ చెప్పాలని సప్తమి డిమాండ్ చేసింది. ప్రస్తుతం సప్తమి గౌడ తెలుగులో నితిన్ సరసన 'తమ్ముడు' సినిమాలో నటిస్తోంది.

Updated Date - Jun 18 , 2024 | 11:10 AM