Jr NTR: ఎన్టీయార్-నీల్ సినిమాకి పుష్ప కాంబో..?

ABN , Publish Date - Oct 07 , 2024 | 11:02 AM

కేజీఎఫ్, సలార్ చిత్రాల ద్వారా మోడ్రన్ మాస్ ఫిల్మ్స్‌లో కొత్త ధోరణి సృష్టించిన ప్రశాంత్ నీల్.. మ్యాన్ ఆఫ్ ది మాసెస్ ఎన్టీయార్ కలవడంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. అయితే ఈ సినిమా కాస్టింగ్ అనౌన్స్ మెంట్ గురించి ఫ్యాన్స్ ఎంతో ఎదురు చూస్తునారు. ఈ నేపథ్యంలో ఓ న్యూస్ ఫాన్స్‌ని తెగ సంబరపడేలా చేస్తుంది. ఇంతకీ ఆ న్యూస్ ఏంటంటే..

samantha and rashmika

ఇటీవల రిలీజై పలు రికార్డులు తిరగరాస్తున్న జూనియర్ ఎన్టీయార్(Jr NTR) మూవీ 'దేవర'తో తారక్ అభిమానులు ఫుల్ జోష్ మీదున్నారు. సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్‌గా రిలీజైనా దేవర ఇప్పటికే 500 కోట్ల వసూళ్లను సాధించింది. దీంతో తారక్ నెక్స్ట్ ప్రాజెక్స్ట్స్‌పై ఫ్యాన్స్ ఫోకస్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత తారక్ బాలీవుడ్ స్టార్ హీరో హ్రితిక్ రోషన్ వార్ 2లో విలన్‌గా నటించనున్నాడు. కాగా ఇప్పటికే ఆ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తవుతండటంతో ఫ్యాన్స్ ఎన్టీయార్-నీల్ సినిమాపై కన్నేశారు. కేజీఎఫ్, సలార్ చిత్రాల ద్వారా మోడ్రన్ మాస్ ఫిల్మ్స్‌లో కొత్త ధోరణి సృష్టించిన ప్రశాంత్ నీల్.. మ్యాన్ ఆఫ్ ది మాసెస్ ఎన్టీయార్ కలవడంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. అయితే ఈ సినిమా కాస్టింగ్ అనౌన్స్ మెంట్ గురించి ఫ్యాన్స్ ఎంతో ఎదురు చూస్తునారు. ఈ నేపథ్యంలో ఓ న్యూస్ ఫాన్స్‌ని తెగ సంబరపడేలా చేస్తుంది. ఇంతకీ ఆ న్యూస్ ఏంటంటే..


ఆర్ఆర్ఆర్(RRR) సినిమా ద్వారా గ్లోబల్ స్టార్ అవతారమెత్తిన తారక్.. అంచనాలకు తగ్గట్టుగానే భారీ ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు. అలాగే కాస్టింగ్ విషయంలోనూ ఏ మాత్రం తగ్గడం లేదు. ఇటీవల రిలీజైన దేవర సినిమాలో జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్‌లతో ఇండియన్ వైడ్‌గా ప్రేక్షకులని ఆకర్షించే ప్రయతనం చేశాడు. నెక్స్ట్ నీల్ ప్రాజెక్ట్‌లోను ఇద్దరు స్టార్ హీరోయిన్స్‌ని దింపే ప్లాన్ చేస్తున్నారట చిత్ర యూనిట్. పుష్ప సినిమాలో హీరోయిన్‌గా చేసి నేషనల్ క్రష్ అవతారమెత్తిన రష్మిక మందన్నని హీరోయిన్ గా కన్సిడర్ చేస్తున్నారట. ఇదే సినిమాలో 'ఊ అంటావా మామ ఊ ఊ అంటావా మామ' సాంగ్‌తో కుర్రకారులని ఊపేసిన సమంతని ఓ ఐటమ్ సాంగ్ కోసం పరిశీలిస్తన్నారట. ఈ పుష్ప కాంబో ఎన్టీయార్ ప్రాజెక్ట్ కి సెట్ అయితే పుష్ప కంటే డబుల్ బ్లాక్‌బస్టర్ ఖాయం అంటున్నారు అభిమానులు.


ఇక సినిమా గురించి గతంలో ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ.. 'ఈ చిత్రాన్ని అందరూ ఓ యాక్షన్‌ సినిమాలా భావిస్తారని నేను ముందే ఊహించాను. కానీ నేను నా జానర్‌లోకి వెళ్లాలనుకోవట్లేదు. నిజానికిది భిన్నమైన భావోద్వేగాలతో వైవిధ్యభరితంగా ఉండే చిత్రంగా ఉంటుంది. నాకిది చాలా కొత్త కథ' అని అన్నారు. ఎన్టీఆర్‌31’ వర్కింగ్‌ టైటిల్‌తో మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి ‘డ్రాగన్‌’ అనే పేరు ఖరారు చేసినట్లు వార్తలు వినిపించాయి. అయితే టైటిల్‌ ఏంటనేది ఇంకా వెల్లడించలేదు. ఈ చిత్రాన్ని కూడా ప్రశాంత్ రెండు భాగాలుగా తెరకెక్కిస్తారని టాక్‌ నడుస్తోంది.

Updated Date - Oct 07 , 2024 | 11:04 AM