Gangs of Godavari : కుటుంబ ప్రేక్షకులనూ ఆకట్టుకుంటుంది

ABN , Publish Date - May 31 , 2024 | 01:55 AM

‘గామి’ లాంటి ప్రయోగాత్మక చిత్రంతో సూపర్‌హిట్‌ అందుకున్న విష్వక్‌సేన్‌ నటించిన చిత్రం ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’. అంజలి, నేహా శెట్టి హీరోయిన్లుగా నటించారు. కృష్ణచైతన్య దర్శకత్వం వహించగా...

Gangs of Godavari : కుటుంబ ప్రేక్షకులనూ ఆకట్టుకుంటుంది

‘గామి’ లాంటి ప్రయోగాత్మక చిత్రంతో సూపర్‌హిట్‌ అందుకున్న విష్వక్‌సేన్‌ నటించిన చిత్రం ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’. అంజలి, నేహా శెట్టి హీరోయిన్లుగా నటించారు. కృష్ణచైతన్య దర్శకత్వం వహించగా, సూర్య దేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. నేడు ఈ చిత్రం విడుదలవుతోంది. ఈ సందర్భంగా గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హీరో విష్వక్‌సేన్‌ మాట్లాడుతూ ‘‘అందరూ అనుకుంటున్నట్లు ఇది కేవలం మాస్‌ ఆడియెన్స్‌ను మాత్రమే కాదు కుటుంబ ప్రేక్షకులనూ ఆకట్టుకుంటుంది. కమర్షియల్‌ అంశాలతో పాటూ కొత్తగానూ ఉంటుంది. తెలుగులో ఇటువంటి ఫార్ములాతో ఇప్పటివరకు చాలా తక్కువ చిత్రాలు వచ్చాయి. ఈ సినిమాకి సీక్వెల్‌ ఉంటుంది’’ అని చెప్పారు. నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ ‘‘గోదావరికి చెందిన లంకల రత్న అనే ఒక స్లమ్‌కు చెందిన కుర్రాడు.. రాజకీయాలను వాడుకుని ఎలా జీవితంలో ఎదిగాడు అనేది ఈ సినిమా కథ. విష్వక్‌ నటన మరో స్థాయిలో ఉంటుంది. ప్రేక్షకులందరూ ఈ సినిమాతో ఎమోషనల్‌గా కనెక్ట్‌ అవుతారు’’ అని చెప్పారు.

Updated Date - May 31 , 2024 | 01:56 AM