Nayanthara : బాధపెట్టాం... క్షమించండి

ABN , Publish Date - Jan 20 , 2024 | 12:20 AM

నయనతార ‘అన్నపూరణి’ వివాదం ఇంకా సద్దుమణగలేదు. కథ రిత్యా ఇందులోని కొన్ని సన్నివేశాలు మత విశ్వాసాలను భంగపరిచేలా వున్నాయంటూ పలువురు అభ్యంతరాలు వెలిబుచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయంపై నయన్‌తో

Nayanthara : బాధపెట్టాం... క్షమించండి

నయనతార ‘అన్నపూరణి’ వివాదం ఇంకా సద్దుమణగలేదు. కథ రిత్యా ఇందులోని కొన్ని సన్నివేశాలు మత విశ్వాసాలను భంగపరిచేలా వున్నాయంటూ పలువురు అభ్యంతరాలు వెలిబుచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయంపై నయన్‌తో సహా చిత్రబృందంపై మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్‌, ముంబయ్‌ల్లో ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. దీంతో చిత్ర నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్‌ ఈ సినిమాను ఓటీటీ స్ట్రీమింగ్‌ నుంచి తొలగించడంతోపాటు వివరణ కూడా ఇచ్చుకుంది. ఇదిలావుంటే.. రీసెంట్‌గా ‘అన్నపూరణి’ వ్యవహారంపై నయనతార భావోద్వేగపూరితంగా సోషల్‌ మీడియా ద్వారా ఓ లేఖను విడుదల చేశారు. ‘బరువెక్కిన హృదయంతో ఈ లెటర్‌ను రాస్తున్నాను. నిజానికి ‘అన్నపూరణి’ మంచి ప్రయత్నం. ఓ మంచి ఆలోచన ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఉద్దేశ్యంతో ఈ సినిమా చేశాం. సంకల్పం గట్టిదైతే ఏదైనా సాధించవచ్చు అనే మంచి విషయాన్ని ఈ సినిమా ద్వారా చర్చించాం. కానీ ఈ ప్రయత్నంలో తెలీకుండానే కొందరి మనసుల్ని బాధపెట్టాం. ఇది ఉద్దేశ్యపూర్వకంగా జరిగింది కాదు. మనోభావాలు దెబ్బతీయడం మా అభిమతం కాదు. నా 20 ఏళ్ల కెరీర్‌లో ఎవరినీ బాధపెట్టలేదు. సానుకూలంగానే ముందుకెళ్లాను. సెన్సార్‌ సర్టిఫికెట్‌ ఇచ్చిన సినిమాను ఓటీటీ నుంచి తొలిగిస్తారని అనుకోలేదు. తెలిసో తెలియకో కొందరిని బాధపెట్టాం. క్షమించమని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం’ అంటూ సోషల్‌ మీడియా ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు నయనతార. ఇక ‘అన్నపూరణి’ కథ విషయానికొస్తే.. ‘అగ్నిహోత్రం లాంటి సంప్రదాయ కుటుంబంలో పుట్టిన ఓ అమ్మాయి, ఛఫ్‌ కావాలనే తన కోరికను ఎలా సాకారం చేసుకుంది? అనే ప్రశ్నకు సమాధానంగా ఈ సినిమా రూపొందింది. నయనతార టైటిల్‌రోల్‌ పోషించిన ఈ చిత్రంలో సత్యరాజ్‌, జై కీలక పాత్రలు పోషించారు. నీలేశ్‌ కృష్ణ దర్శకుడు.

Updated Date - Jan 20 , 2024 | 12:20 AM