Mega Star: పారిస్ ఒలింపిక్స్ లో సందడి చేసిన చిరు దంపతులు

ABN , Publish Date - Jul 27 , 2024 | 01:11 PM

చిరంజీవి తన భార్య సురేఖతో, కొడుకు, కోడలుతో విహార యాత్రకి వెళ్లిన సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితం లండన్ వీధుల్లో కుటుంబంతో, మనవరాలితో తిరుగుతూ కనిపించిన చిరంజీవి, ఈరోజు పారిస్ లో జరుగుతున్న ఒలింపిక్స్ చూడటానికి హాజరయ్యారు. భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న క్రీడాకారాలుకి శుభాకాంక్షలు తెలియచేశారు.

Chiranjeevi and his wife at Paris Olympics

మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు తన కుటుంబంతో విహార యాత్రకి వెళ్లారు. కొన్ని రోజుల క్రితమే తన మనవరాలు క్లింకారా, భార్య, కొడుకు రామ్ చరణ్, కోడలు ఉపాసనతో లండన్ వీధుల్లో తిరుగుతూ కనిపించారు. ఆ ఫోటోలు కూడా షేర్ చేశారు. ఈరోజు చిరంజీవి లండన్ నుండి పారిస్ వెళ్లారు, అక్కడ జరుగుతున్న ఒలింపిక్స్ లో సందడి చేశారు. (Chiranjeevi and his wife hold the Olypic Torch replica at Paris Olympics)

ఒలింపిక్స్ టార్చ్ లాంటిదే ఒకటి తయారుచేసి అది ఒలింపిక్స్ చూడటానికి వచ్చిన ప్రేక్షకుల కోసం పెట్టారు. ఆ రెప్లికా ని పట్టుకొని, చిరంజీవి అతని భార్య సురేఖ పోజులు ఇచ్చారు. అలాగే ఒలింపిక్స్ లో భారత దేశం తరఫును ప్రాతినిధ్యం వహిస్తున్న క్రీడాకారులు అందరికీ తన శుభాకాంక్షలు తెలియచేసారు చిరంజీవి. (Chiranjeevi at Paris Olympics 2024)

chiranjeevicoupleatolympics.jpg

ఈసారి ఒలింపిక్స్ లో పాల్గొంటున్న క్రీడాకారులు అందరూ ఎక్కువ పతకాలు గెలుచుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత మెడల్ టాలీని పెంచుతారాన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు చిరంజీవి. ప్రస్తుతం చిరంజీవి 'విశ్వంభర' అనే సినిమా చేస్తున్నారు. దీనికి మల్లిడి వసిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. ఇదొక ఫాంటసీ నేపథ్యంలో వచ్చే సినిమా. ఇందులో సుమారు ఆరుగురు కథానాయికలు వున్నారు, అందులో ప్రధాన పాత్ర త్రిష పోహిస్తోంది.

Updated Date - Jul 27 , 2024 | 02:10 PM