Bellamkonda Sai Srinivasu: అనుపమాతో రెండోసారి.. విభిన్న కథతో

ABN , Publish Date - Jul 01 , 2024 | 03:41 PM

బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ కథానాయకుడిగా ‘చావు కబురు చల్లగా’ ఫేమ్‌ కౌశిక్‌ పెగళ్లపాటి దర్శకత్వంలో నూతన చిత్రం సోమవారం అన్నపూర్ణ స్టూడియోలో మొదలైంది.

Bellamkonda Sai Srinivasu: అనుపమాతో రెండోసారి.. విభిన్న కథతో

బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ కథానాయకుడిగా ‘చావు కబురు చల్లగా’ ఫేమ్‌ కౌశిక్‌ పెగళ్లపాటి దర్శకత్వంలో నూతన చిత్రం సోమవారం అన్నపూర్ణ స్టూడియోలో మొదలైంది. షైన్ స్క్రీన్ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. డిఫరెంట్‌ వరల్డ్‌, యూనిక్‌ ప్రిమైజ్‌లో సెట్‌ చేయబడిన ఈ హారర్‌-మిస్టరీ మూవీ ఇప్పటికే ఆసక్తికరమైన ఫస్ట్‌ లుక్‌తో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే! ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన కథానాయికగా నటిస్తోంది. 

«§æþ$¯èþ.jpg

వీరిద్దరూ కలిసి గతంలో 'రాక్షసుడు' చిత్రంలో నటించి సూపర్‌హిట్‌ అందుకున్నారు. ఈ నెల 11 నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలుపెట్టనున్నారు. ప్రేక్షకులకు సీట్‌ ఎడ్జ్‌లో కూర్చొబెట్టే చిత్రమిదని మేకర్స్‌ చెప్పారు. నెరేటివ్‌ అందించబోతున్నారు. హీరోహీరోయిన్ల ఇద్దరికీ కూడా విభిన్నమైన పాత్రలని తెలిపారు. శరవేగంగా చిత్రీకరణ జరుగుతుందని చిత్ర బృందం తెలిపింది.

Updated Date - Jul 01 , 2024 | 03:41 PM