Multi-starrer: బెల్లంకొండ, నారా రోహిత్ మల్టీ స్టారర్, దర్శకుడు ఎవరో తెలుసా...

ABN , Publish Date - Jul 27 , 2024 | 12:34 PM

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్ లు ఒక మల్టీ స్టారర్ సినిమా చెయ్యాలని నిర్ణయించుకున్నారు. కథ నచ్చడంతో, ఈ ఇద్దరు నటులు ఒక మల్టీ స్టారర్ సినిమాతో ఈసారి ప్రేక్షకులను అలరించాలని అనుకున్నారు. ఆగస్టు మొదటి వారంలో ఈ సినిమా ప్రారంభం అయ్యే సూచనలు ఉన్నాయని అనుకుంటున్నారు

Bellamkonda Sai Sreenivas and Nara Rohit

తెలుగు సినిమా పరిశ్రమలో ఇప్పుడు మల్టీస్టారర్స్ మళ్ళీ మొదలవుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఇద్దరు యువ నటులు మల్టీ స్టారర్ సినిమా చెయ్యాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్ ఈ ఇద్దరూ కలిసి ఒక మల్టీ స్టారర్ సినిమాలో నటించనున్నారని తెలిసింది. ఈ సినిమా ఆగస్టు మొదటి వారంలో అధికారికంగా లాంచ్ అయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. (Bellamkonda Sai Sreenivas and Nara Rohit decided to act together in a multi-starrer, saya a source)

bellamkonda.jpeg

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వరస సినిమాలతో బిజీగా వున్నారు, అలాగే నారా రోహిత్ కూడా ఇప్పుడు బిజీ అయిపోయారు. అయినా కూడా ఈ ఇద్దరికీ ఒక కథ నచ్చడంతో ఇద్దరూ కలిసి సినిమా చెయ్యాలని నిర్ణయించుకోవటం ఒక శుభ పరిణామం అని చెప్పాలి. 'నాంది' లాంటి ఒక మంచి సినిమాని అందించిన విజయ్ కనకమేడల ఈ మల్టీ స్టారర్ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నట్టుగా భోగట్టా. (Vijay Kanakamedala of 'Naandhi' fame is all set to direct a multi starrer that stars Bellamkonda Sai Sreenivas and Nara Rohit)

nararohitone.jpg

ఈ మల్టీ స్టారర్ సినిమాని ప్రముఖ నిర్మాత కెకె రాధామోహన్ నిర్మించనున్నారని తెలుస్తోంది. విజయ్ కనకమేడల కథని ఈ ఇద్దరి నటులకి వినిపించినప్పుడు వారిద్దరికీ ఈ కథ ఎంతగానో నచ్చి ఇద్దరూ ఈ సినిమా చెయ్యడానికి నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. ఆగస్టులో ఈ సినిమాకి ముహూర్తం కూడా సెట్ చేసినట్టుగా కూడా ఒక భోగట్టా.

vijaykanakamedala.jpg

విజయ్ కనకమేడల ఇంతకు ముందు అల్లరి నరేష్ కథానాయకుడిగా 'నాంది' అనే ఒక మంచి సినిమా చేశారు. దర్శకుడిగా అతని ప్రతిభకి ఆ సినిమా ఒక మంచి నిదర్శనం. అటువంటి విజయ్ ఇప్పుడు ఈ మల్టీ స్టారర్ సినిమా చేస్తున్నారు అంటే, ఈ సినిమాపై అంచనాలు పెద్దగా ఉన్నాయని అంటున్నారు.

Updated Date - Jul 27 , 2024 | 12:34 PM