Aswini Dutt: కొన్ని క్షణాలు ఎంతో అపురూపమైనవి

ABN , Publish Date - Jun 21 , 2024 | 03:53 PM

బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan) మించినవారు లేదంటూ ప్రముఖ నిర్మాత అశ్వనీదత్‌ (Ashwini Dutt) ప్రశంసలు కురిపించారు

 Aswini Dutt: కొన్ని క్షణాలు ఎంతో అపురూపమైనవి

బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan) మించినవారు లేదంటూ ప్రముఖ నిర్మాత అశ్వనీదత్‌ (Ashwini Dutt) ప్రశంసలు కురిపించారు. ‘కల్కి(kalki)’ ఈవెంట్‌లో బిగ్‌బీ చేసిన పనికి ఆశ్చర్యపోయానని చెప్పారు. ప్రభాస్‌ హీరోగా తెరకెక్కిన ‘కల్కి 2898 ఏడీ’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఇటీవల ముంబయిలో జరిగిన సంగతి తెలిసిందే. ఆ వేదికపై అమితాబ్‌ మాట్లాడుతూ.. ఇలాంటి వినయపూర్వకమైన వ్యక్తిని తన కెరీర్‌లో ఎన్నడూ చూడలేదని అశ్వనీదత్‌ను కొనియాడారు. నిర్మాతగా 50 ఏళ్లుగా రాణిస్తున్నారంటూ బాలీవుడ్‌ మీడియాకు గొప్పగా చెప్పారు. అనంతరం అమితాబ్‌.. అశ్వనీదత్‌ పాదాలు తాకి ఆశీస్సులు తీసుకునే ప్రయత్నం చేశారు. దీనిపై   అశ్వనీదత్‌   స్పందించారు. సోషల్‌ మీడియా వేదికగా ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టారు.

Kalki-5.jpg

‘‘కల్కి’ ఈవెంట్‌లో ఎన్నడూ ఊహించనిది జరిగింది. అమితాబ్‌ చేసిన దానికి నేను ఆశ్చర్యపోయా. కాసేపు అయోమయానికి గురయ్యా. వెంటనే తేరుకొని ఆయన పాదాలను తాకే ప్రయత్నం చేశా. జీవితంలో కొన్ని క్షణాలు ఎంతో అపురూపమైనవి. అలాంటి మధుర జ్ఞాపకాలను ఆ ఈవెంట్‌ అందించింది. అమితాబ్‌.. ఇండియన్‌ సినిమా యోధుడు, ఓ లెజెండ్‌. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే వ్యక్తిత్వం ఉన్న ఆయనకు సెల్యూట్‌ చేస్తున్నా’’ అని పేర్కొన్నారు. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రంలో అమితాబ్‌, కమల్‌ హాసన్‌, దీపికా పదుకొణె, దిశా పటానీ కీలక పాత్రఽలు పోషించారు. ఈ చిత్రం ఈనెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Updated Date - Jun 21 , 2024 | 04:02 PM