Just A Minute: మంచి ఫన్ కాన్సెఫ్ట్‌తో ‘జస్ట్ ఏ మినిట్’.. ట్రైలర్ విడుదల

ABN , Publish Date - Jul 13 , 2024 | 09:37 PM

‘ఏడు చేపల కథ’ ద్వారా పరిచయమైన అభిషేక్ పచ్చిపాల హీరోగా నజియా ఖాన్, వినీషా జ్ఞానేశ్వర్ హీరోయిన్లుగా రెడ్ స్వాన్ ఎంటర్టైన్మెంట్, సుధర్మ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం ‘జస్ట్ ఏ మినిట్’. తన్వీర్ మరియు ప్రకాష్ నిర్మించిన ఈ చిత్రానికి యశ్వంత్ దర్శకుడు. కామెడీ లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్‌ను శనివారం గ్రాండ్‌గా విడుదల చేశారు.

Just A Minute Trailer Launch Event

‘ఏడు చేపల కథ’ ద్వారా పరిచయమైన అభిషేక్ పచ్చిపాల (Abhishek Pachipala) హీరోగా నజియా ఖాన్, వినీషా జ్ఞానేశ్వర్ హీరోయిన్లుగా రెడ్ స్వాన్ ఎంటర్టైన్మెంట్, సుధర్మ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం ‘జస్ట్ ఏ మినిట్’ (Just A Minute). తన్వీర్ మరియు ప్రకాష్ నిర్మించిన ఈ చిత్రానికి యశ్వంత్ దర్శకుడు. కామెడీ లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్‌ను శనివారం గ్రాండ్‌గా విడుదల చేశారు. ఈనెల 19న సినిమాను విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

ట్రైలర్ విడుదల కార్యక్రమంలో నిర్మాతలు తన్వీర్, ప్రకాష్ మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరూ చాలా కష్టపడి పని చేశాం. ఈ సినిమా కోసం పని చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఈనెల 19న రిలీజ్ చేస్తున్నాం. ప్రేక్షకులు సినిమా చూసి ఆదరించి మంచి సక్సెస్ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నామని అన్నారు. (Just A Minute Trailer Released)


Just.jpg

హీరో అభిషేక్ పచ్చిపాల మాట్లాడుతూ.. ఈ సినిమా మొత్తం మంచి ఫన్ ఉంటుంది. డైరెక్టర్ అభిషేక్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. మ్యూజిక్ డైరెక్టర్ బాజీ ఇచ్చిన మ్యూజిక్ సినిమాకి హైలైట్. నిర్మాతలు చాలా బాగా సపోర్ట్ చేశారు. సినిమా ఎవరిని డిజప్పాయింట్ చేయదు. సినిమా హిట్ చేసినా సినిమాలు చేస్తా.. ఫ్లాప్ చేసినా సినిమాలు చేస్తా. ప్రేక్షకులు ఈ సినిమా చూసి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నానని తెలిపారు. దర్శకుడు యశ్వంత్ మాట్లాడుతూ.. నేను ముందు ఈ సినిమాకి కో డైరెక్టర్‌గా వచ్చాను. అనుకోని కారణాలవల్ల నిర్మాత తన్వీర్ నాకు దర్శకుడిగా అవకాశం ఇచ్చారు. ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అభిషేకం ఫణి ఈ కథ వినగానే ఒప్పుకొని నాకు అవకాశాన్ని ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. ప్రేక్షకులు ఈ సినిమాని చూసి ఆదరించి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నానని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో హీరోయిన్లు నజియా ఖాన్, వినీషా జ్ఞానేశ్వర్, జబర్దస్త్ ఫణి మాట్లాడారు.

Updated Date - Jul 13 , 2024 | 09:37 PM