Triptii Dimri: ‘యానిమల్‌’ అన్ని రకాలుగా ఉపయోగపడింది!

ABN , Publish Date - Jul 27 , 2024 | 03:38 PM

రణ్‌బీర్‌ కపూర్‌(Ranbir Kapoor), రష్మిక (Rashmika mandanna) జంటగా నటించిన యాక్షన్‌ డ్రామా ‘యానిమల్‌’ (Animal).  త్రిప్తి డిమ్రీ (Triptii Dimri) ఇందులో జోయాగా కనిపించి యువత మనసును కట్టిపడేసింది.

రణ్‌బీర్‌ కపూర్‌(Ranbir Kapoor), రష్మిక (Rashmika mandanna) జంటగా నటించిన యాక్షన్‌ డ్రామా ‘యానిమల్‌’ (Animal).  త్రిప్తి డిమ్రీ (Triptii Dimri) ఇందులో జోయాగా కనిపించి యువత మనసును కట్టిపడేసింది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని.. ‘యానిమల్‌’పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ సినిమా తన కెరీర్‌కు ఏవిధంగా ఉపయోగపడిందనేది చెప్పారు.. ‘‘యానిమల్‌’ నా కెరీర్‌కు ఎంతో ఉపయోగపడింది. దాని తర్వాత నాకు అభిమానులు ఎక్కువయ్యారు. ఇప్పుడు నా గత చిత్రాలను చూస్తున్నారు. అందులో భాగమైనందుకు ఆనందంగా ఉన్నా. ఎంతోమంది గొప్ప నటీనటులతో వర్క్‌ చేయడం వల్ల ఎన్నో విషయాలు నేర్చుకున్నా. మా చిత్రానికి తీవ్ర విమర్శలు వచ్చిన మాట వాస్తవమే. సినీరంగంలో ఇలాంటివి సాధారణమే! ప్రతిఒక్కరూ ఏదో ఒక సమయంలో ఇలాంటివి ఎదుర్కొంటూనే ఉంటారు’’ అని తెలిపారు.

Tripti.jpg
‘యానిమల్‌ పార్క్‌’ గురించి మాట్లాడుతూ ‘‘నిజం చెప్పాలంటే.. సినీప్రియుల మాదిరిగానే నాక్కూడా ‘యానిమల్‌ పార్క్‌’ ఎప్పుడు మొదలవుతుందో తెలియదు. ఆ సినిమా కథ ఏంటి? షూటింగ్‌ ఎప్పటినుంచి ప్రారంభిస్తారు? అనే విషయాలపై ఏమాత్రం అవగాహన లేదు’’ అని చెప్పారు. తండ్రీ తనయుల సెంటిమెంట్‌తో సందీప్‌రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ చిత్రంలో తీవ్ర హింసను ప్రోత్సహించడం ఏం బాలేదంటూ పలువురు బాలీవుడ్‌ దర్శక - నిర్మాతలు, రచయితలు విమర్శలు చేశారు. ‘యానిమల్‌’కు కొనసాగింపుగా ‘యానిమల్‌ పార్క్‌’ రానుంది. మొదటిభాగం కన్నా మరింత భారీగా హింసాత్మకంగా.. ప్రేక్షకుల ఊహాకు అందని యాక్షన్‌ సన్నివేశాలతో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దనున్నట్లు దర్శకుడు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. 2026లో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంంచడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Updated Date - Jul 27 , 2024 | 03:38 PM