Tripti Dimri: అది ట్యాగ్‌ కాదు అభిమానులు పెంచిన బాధ్యత!

ABN , Publish Date - Jul 20 , 2024 | 02:29 PM

అంతకుముందు పలు చిత్రాల్లో నటించినా ‘యానిమల్‌’ (Animal) సినిమాతో ఒక్కసారిగా ఫేమ్‌ సొంతం చేసుకున్నారు బాలీవుడ్‌ నటి త్రిప్తి దిమ్రీ (Tripti Dimri). ఈ సినిమా తర్వాత ఆమె ఫాలోయింగ్‌ రెట్టింపు అయింది.


అంతకుముందు పలు చిత్రాల్లో నటించినా ‘యానిమల్‌’ (Animal) సినిమాతో ఒక్కసారిగా ఫేమ్‌ సొంతం చేసుకున్నారు బాలీవుడ్‌ నటి త్రిప్తి దిమ్రీ (Tripti Dimri). ఈ సినిమా తర్వాత ఆమె ఫాలోయింగ్‌ రెట్టింపు అయింది. దాంతో అభిమానులు ఆమెకు  నేషనల్‌ క్రష్‌ (national Crush Tag) అనే ట్యాగ్‌ ఇచ్చేశారు. తనని ‘నేషనల్‌ క్రష్‌’ అని పిలవడంపై త్రిప్తి స్పందించారు. ‘‘నటిగా బాలీవుడ్‌లో కెరీర్‌ మొదలుపెట్టి దాదాపు ఏడేళ్లు అయ్యింది. అందుకు సంతోషంగా ఉన్నా. గొప్ప నటీనటులు దర్శకులతో కలిసి పని చేస్తానని కెరీర్‌ బిగినింగ్‌లో ఎప్పుడూ అనుకోలేదు. ఎందుకంటే, యాక్టింగ్‌ను నేను సీరియస్‌గా తీసుకోలేదు. మొదటి సినిమా పూర్తైన తర్వాత కెరీర్‌ను విధికే వదిలేశా. ‘ఒక సినిమా పూర్తి చేశా. అదృష్టం ఉంటే రెండో సినిమా రావొచ్చు’ అనుకున్నా. అలాంటి సమయంలో ‘లైలా మజ్ను’ కోసం ఆడిషన్‌లో పాల్గొన్నా. ఆనాటి నుంచి యాక్టింగ్‌పై దృష్టిపెట్టా.

tripti.jpg

నటనలో శిక్షణ తీసుకొన్నాను. ప్రేక్షకులు నా నటనతో కనెక్ట్‌ అవుతున్నారు. నేషనల్‌ క్రష్‌ అనేది నా దృష్టిలో ట్యాగ్‌ మాత్రమే కాదు. అభిమానులు ప్రేమ. వాళ్లు నన్ను అలా పిలుస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఇది నాపై మరింత బాధ్యత పెంచింది’’ అని అన్నారు. త్రిప్తి నటించిన సరికొత్త చిత్రం ‘బ్యాడ్‌న్యూస్‌’. ఆనంద్‌ తివారీ దర్శకుడు. విక్కీ కౌశల్‌, అమీ విర్క్‌ కీలక పాత్రధారులు.  భారీ అంచనాల మధ్య శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం మంచి టాక్‌ సొంతం చేసుకుంది. 

Updated Date - Jul 20 , 2024 | 02:53 PM